Huzurabad By Poll : బీజేపీ జెండా ఎగరవేస్తాం, హుజూరాబాద్‌‌లో ఈటల

హుజూరాబాద్‌ రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులు తీరుగుతున్నాయి.. ఓ వైపు టీఆర్‌ఎస్‌, మరోవైపు బీజేపీ హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకోవడానికి టీఆర్‌ఎస్‌.... హుజూరాబాద్‌ గడ్డపై జెండా పాతేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నాయి.

Huzurabad By Poll : బీజేపీ జెండా ఎగరవేస్తాం, హుజూరాబాద్‌‌లో ఈటల

Etela Rajender

Etela Rajender Visit Huzurabad : హుజూరాబాద్‌ రాజకీయాలు రోజురోజుకు కీలక మలుపులు తీరుగుతున్నాయి.. ఓ వైపు టీఆర్‌ఎస్‌, మరోవైపు బీజేపీ హుజూరాబాద్‌లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. సిట్టింగ్‌ స్థానాన్ని నిలుపుకోవడానికి టీఆర్‌ఎస్‌…. హుజూరాబాద్‌ గడ్డపై జెండా పాతేందుకు బీజేపీ ఎత్తుగడలు వేస్తున్నాయి.

ఇందులో భాగంగా మాజీ మంత్రి, హుజూరాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఈ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆత్మగౌరవం నినాదంతో హుజూరాబాద్‌లో సతీసమేతంగా ఇక్కడకు చేరుకున్నారు. 2021, జూన్ 17వ తేదీ గురువారం ఉదయం ఇక్కడకు చేరుకున్న ఈయన..నియోజకవర్గంలోని కమలాపూర్‌, జమ్మికుంట మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. ఈటల సొంత మండలం కమలాపూర్‌లోని శనిగరం, గోపాలపూర్‌ ప్రజలు, అనుచరులతో ఈటల భేటీ కానున్నారు. ఉప ఎన్నికపై వారితో చర్చించనున్నారు.

తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీ జెండాను కచ్చితంగా ఎగరవేస్తామన్నారు మాజీ మంత్రి ఈటల రాజేందర్. హుజూరాబాద్ వెళ్తున్న ఈటల రాజేందర్‌కు అడుగడుగున ఘనస్వాగతం పలికారు బీజేపీ శ్రేణులు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో బీజేపీ కార్యకర్తలు, నేతలు ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. ఉద్యమ సమయం నుంచే గజ్వేల్ ప్రాంత ప్రజలతో తనకు అనుబంధముందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి తన వంతుగా కృషి చేస్తానని ఈటల తెలిపారు.

మరోవైపు…ఈటల బీజేపీలో చేరి సొంత నియోజకవర్గం చేరిన సమయంలో.. హుజూరాబాద్ నియోజకవర్గంపై టీఆర్ఎస్ ఫోకస్ చేసింది. ప్రభుత్వ పథకాలను వివరిస్తూ ఫ్లెక్సీలు, భారీ హోర్డింగులతో ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఉప ఎన్నికలలో విజయం సాధించి గులాబీ జెండాను ఎగరవేసేలా ఆ పార్టీ శ్రేణులు సమయాత్తం అయ్యాయి. సీఎం కేసీఆర్‌ బొమ్మతో.. ప్రభుత్వ పథకాలను వివరించేలా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశాయి. ముఖ్యంగా రైతులకు సంబంధించి పథకాలనే హైలెట్‌ చేస్తూ ఈ హోర్డింగ్స్‌ వెలిశాయి.