Suryapeta : ధాన్యం ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. సూర్యాపేట జిల్లాలో రైతుల ఆందోళన

సూర్యాపేట జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం ట్రాక్టర్లను సరిహద్దుల వద్దే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మిర్యాలగూడ- కోదాడ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Suryapeta : ధాన్యం ట్రాక్టర్లను అడ్డుకున్న పోలీసులు.. సూర్యాపేట జిల్లాలో రైతుల ఆందోళన

Protest (1)

Farmers protest in Suryapeta : సూర్యాపేట జిల్లాలో రైతులు ఆందోళన చేపట్టారు. ధాన్యం ట్రాక్టర్లను సరిహద్దుల వద్దే అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిర్యాలగూడ- కోదాడ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. తడిసిన ధాన్యంతో రైతుల ఆందోళన చేస్తున్నారు. మార్కెట్‌ యార్డు వరకు అనుమతించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

సూర్యాపేట జిల్లాలో ధాన్యం అమ్మకానికి అన్నదాతలు ఇక్కట్లు పడుతున్నారు. మిర్యాలగూడ రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు. అయితే.. పోలీసులు ధాన్యం ట్రాక్టర్లను జిల్లా సరిహద్దు వద్దే నిలిపివేస్తున్నారు.

Renuka Chaudhary : అమరావతి రైతుల మహా పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తోన్న కాంగ్రెస్ నాయకురాలు రేణుకా చౌదరి

నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి మూసీ బ్రిడ్జ్ వద్ద రాత్రి నుంచి రైతులు ధాన్యం ట్రాక్టర్లతో పడిగాపులు కాస్తున్నారు. రాత్రి వర్షం కురవడంతో ధాన్యం తడిసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం మార్కెట్ యార్డ్ వరకు అనుమతి ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.