జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

  • Published By: bheemraj ,Published On : November 7, 2020 / 01:05 AM IST
జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం

Fire accident : మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి దూలపల్లి పారిశ్రామిక వాడలోని బ్లిస్‌ ఎంటర్‌ ప్రైజెస్‌ రబ్బర్‌ పరిశ్రమంలో అగ్నిప్రమాదం సంభవించింది.



మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలార్పుతున్నారు.



ఈ ప్రమాదంలో లక్షల్లో ఆస్తినష్టం వాటిల్లింది. ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఏ మేరకు నష్టం వాటిల్లిందో ఇప్పుడే చెప్పలేమని అధికారులు తెలిపారు. ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకునేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.