ఒకే చితిపై భార్యాభర్తలకు అంత్యక్రియలు…మరణంలోనూ వీడని బంధం

  • Published By: bheemraj ,Published On : June 19, 2020 / 01:09 AM IST
ఒకే చితిపై భార్యాభర్తలకు అంత్యక్రియలు…మరణంలోనూ వీడని బంధం

కలకాలం తోడుంటానని పెళ్లి మండపంలో ఏడడుగుల సాక్షిగా ఒక్కటైన ఆ దంపతులు మరణంలోనూ భార్యాభర్తల బంధాన్ని వీడలేదు. ఒకే చితిపై భార్యాభర్తల అంత్యక్రియలు జరిపారు. కృష్ణ జిల్లా జగ్గయ్యపేట పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు. 

ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి చెందగా వీరందరికీ గురువారం దహన సంస్కారాలు నిర్వహించారు. వీరిలో భార్యా, భర్తలిద్దరినీ ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. దీంతో మరణంలోనూ వారి బంధం విడిపోలేదని, చావులోనూ ఒక్కటయ్యారంటూ చూసినవారు కన్నీటి పర్యంతమయ్యారు. 

మృతుల స్వగ్రామమైన ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వారి బంధువుల రోధనలతో ఊరంతా తల్లడిల్లిపోయింది. 

Read: కరోనా దెబ్బ : తెలంగాణలో డిగ్రీ పరీక్షలు రద్దు ?