జీహెచ్ఎంసీ బీజేపీ మేయర్ అభ్యర్థిగా రాధా ధీరజ్ రెడ్డి..?

జీహెచ్ఎంసీ బీజేపీ మేయర్ అభ్యర్థిగా రాధా ధీరజ్ రెడ్డి..?

ghmc bjp mayor candidate dheeraj reddy: రేపు(ఫిబ్రవరి 11,2021) జీహెచ్ఎంసీ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నిలకు బీజేపీ సమాయత్తం అయ్యింది. మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని బీజేపీ ప్రకటించింది. గెలుపోటములతో సంబంధం లేకుండా పోటీ చేస్తామని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. రాష్ట్ర కార్యాలయంలో తమ కార్పొరేటర్లతో బీజేపీ ముఖ్య నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ రాంచందర్ రావు, రాంచందర్ రెడ్డి హాజరయ్యారు.

ఎన్నికల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలు చర్చించారు. కాగా, తమ పార్టీ మేయర్ అభ్యర్థిగా ఆర్కేపురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి పేరుని దాదాపుగా బీజేపీ ఖరారు చేసినట్టు తెలుస్తోంది. అలాగే ఫ్లోర్ లీడర్ పదవి కోసం బీజేపీ కార్పొరేటర్లు పోటీపడుతున్నారు.

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 56 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలుపొందాయి. ఎక్స్ అఫిషియో బలాబలాలు చూస్తే టీఆర్ఎస్ 32, ఎంఐఎం 10, బీజేపీ 02.