GHMC petition : గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్

గణేష్ నిమజ్జనంపై జీహెచ్ఎంసీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై తీర్పును పున:పరిశీలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పిటిషన్ వేశారు.

GHMC petition : గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్

Ghmc

GHMC review petition in High Court : గణేష్ నిమజ్జనంపై జీహెచ్ఎంసీ హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనంపై తీర్పును పున:పరిశీలించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ పిటిషన్ వేశారు. తీర్పులో ప్రధానంగా 4 అంశాలు తొలగించాలని జీహెచ్ఎంసీ కోరింది. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీఓపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తివేయాలని కోరింది. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరింది. సాగర్ లో కృత్రిమ రంగులు లేని విగ్రహాలనే అనుమతించాలన్న ఆంక్షలు తొలగించాలని విన్నవించుకుంది. హుస్సేన్ సాగర్ లో రబ్బరు డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులు సవరించాలని కోరింది.

ట్యాంక్ బండ్ వైపు అనుమతించక పోతే.. నిమజ్జనం పూర్తి కావడానికి 6 రోజులు పడుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. వ్యయ ప్రయాసలతో కూడిన రబ్బరు డ్యాం నిర్మాణానికి కొంత సమయం అవసరమన్నారు. నగర వ్యాప్తంగా మండపాల్లో వేల సంఖ్యలో భారీ విగ్రహాలు ఉన్నాయని తెలిపారు. విగ్రహాల సంఖ్యకు తగినన్ని నీటి కుంటలు లేవన్నారు. పెద్ద విగ్రహాలను నీటి కుంటల్లో నిమజ్జనం చేయడం కష్టమని తెలిపారు. ఇప్పటికే హుస్సేన్ సాగర్ వద్ద క్రేన్లు, ఇతర ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

Ganesh’s immersion : గణేష్ నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేయనున్న తెలంగాణ ప్రభుత్వం

నెల క్రితమే ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. ఇప్పటికిప్పుడు ప్రణాళికలు మార్చితే గందరగోళం తలెత్తుతుందన్నారు. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని తెలిపారు. మాస్కులు ధరించేలా ప్రజలను చైతన్య పరుస్తామని వెల్లడించారు. విగ్రహాలు ఆపితే వాహనాలు రోడ్లపై నిలిపివేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపునిచ్చిందన్న విషయాన్ని గుర్తు చేశారు. హైకోర్టు మినహాయింపులు ఇవ్వకపోతే గందరగోళం తలెత్తి నగరం స్తంభిస్తుందన్నారు.

మరోవైపు గణేష్ నిమజ్జనంపై హైకోర్టు ఉత్తర్వులపై న్యాయపోరాటానికి సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం.. ఇవాళ రివ్యూ పిటిషన్ దాఖలు చేయనుంది. నిమజ్జనాల కోసం ఇప్పటికిప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అసాధ్యమని తెలపనుంది. సమయం తక్కువగా ఉండటంతో కుంటల నిర్మించడం వంటి పనులు చేపట్టడం కష్టమవుతుందని అందుకే ఈసారికి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనానికి అనుమతించాలని ప్రభుత్వం కోరనుంది. హుస్సేన్‌ సాగర్‌లో నిమజ్జనం చేసిన 48 గంటల్లో వ్యర్థాలు తీసివేస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.