Girl Rape Case : బాలికను గర్భవతి చేసిన కేసులో దోషికి జీవితఖైదు, రూ.20వేలు జరిమానా

ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కోర్టు జీవితఖైదు, రూ.20 వేలు జరిమానా విధించింది.

Girl Rape Case : బాలికను గర్భవతి చేసిన కేసులో దోషికి జీవితఖైదు, రూ.20వేలు జరిమానా

Girl Rape Case

Girl Rape Case : ఓ బాలికను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి కోర్టు జీవితఖైదు, రూ.20 వేలు జరిమానా విధించింది. మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్డాకుల మండలంలోని రాచాల గ్రామానికి చెందిన కావలి ఆంజనేయులు(27) వనస్థలిపురం సెల్ప్‌ ఫైనాన్స్‌ కాలనీలో మేస్త్రీ పని చేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా, ఈ విషయాన్ని దాచాడు. 2015లో ఓ బాలిక(15)ను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

ఆ తర్వాత అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక గర్భం దాల్చడంతో ఈ దారునం బయటపడింది. బాధితురాలి తల్లి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ కేసు విచారించిన సైబరాబాద్‌ మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ న్యాయమూర్తి సురేష్‌.. నిందితుడికి పోక్సో చట్టం కింద శిక్ష విధిస్తూ శుక్రవారం(ఏప్రిల్ 9,2021) తీర్పు చెప్పారు.

నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా.. ఆడపిల్లకు రక్షణ కరువైంది. నిత్యం ఏదో ఒక చోట వారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మాయమాటలతో నమ్మించి కొందరు కామాంధులు తమ కామ కోరికలు తీర్చుకుంటున్నారు. అవసరం తీరాక ముఖం చాటేస్తున్నారు. మరికొందరు స్నేహం ముసుగులో, సాయం ముసుగులో దారుణాలకు ఒడిగడుతున్నారు. వారి అవసరాలను ఆసరాగా చేసుకుని లైంగిక దాడులు చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధిస్తున్నా ఆడవారిపై దారుణాలు మాత్రం ఆగడం లేదు.