Private Teachers: టీచర్లకు ఆర్ధిక సాయం.. మీ పేరు ఉందో లేదు తెలుసుకోండి

కరోనా సమయంలో పాఠశాలలు మూతపడటంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ప్రైవేట్ టీచర్ల బాధలు గుర్తించిన ప్రభుత్వం వారికీ ఆర్ధిక సాయం అందించేందుకు సిద్ధమైంది.

Private Teachers: టీచర్లకు ఆర్ధిక సాయం.. మీ పేరు ఉందో లేదు తెలుసుకోండి

Private Teacher

Private Teachers: కరోనా సమయంలో పాఠశాలలు మూతపడటంతో ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు పడుతున్న విషయం తెలిసిందే.. ప్రైవేట్ టీచర్ల బాధలు గుర్తించిన ప్రభుత్వం వారికీ ఆర్ధిక సాయం అందించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఓ జాబితాను తయారు చేసింది. మొత్తం 1,18,004 మంది ప్రైవేట్ స్కూల్స్ లో పనిచేసే, టీచర్లు, బోధనేతర సిబ్బంది ఉన్నారు. వీరిలో 1,06,383 మంది టీచర్లు కాగా, 11,621 మంది బోధనేతర సిబ్బంది.

ఇక వీరి సంఖ్య మరో 10వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇక ఎంపికైన వారికి మంగళవారం నుంచి రూ.2వేల నగదు వారి వారి అకౌంట్లలో జమచేయనున్నారు. ఇక 21 నుంచి 25 మధ్య 25 కేజీల బియ్యం అందించనున్నారు. గత వారం ప్రారంభమైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఆదివారానికి ముగిసింది. రాష్ట్రంలోని 33 కలెక్టర్ కార్యాలయాలకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఆదివారం తుది జాబితాను విడుదల చేశారు.

సోమవారం ఈ జాబితాను ఆర్థికశాఖకు పంపించనున్నారు. నగదు సాయం కోసం ఇప్పటికే విద్యాశాఖ రూ.32 కోట్లు మంజూరుచేయగా, పౌరసరఫరాలశాఖ 3.625 టన్నుల సన్న బియ్యాన్ని సిద్ధంచేసింది. సీఎం కేసీఆర్ ఆర్ధిక సాయం గురించి మాట్లాడిన వెంటనే దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు అధికారులు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దీనికి సంబందించిన ప్రక్రియ మొత్తం జరిగింది. మొత్తం 2,06,345 దరఖాస్తులు రాగా, వాటిని వడబోసిన అధికారులు జిల్లాలవారీగా లబ్ధిదారులను ఎంపికచేశారు.

వీరిలో బోధనా 1,53,525.. బోధనేతర సిబ్బంది 52,820 ఉన్నారు. 1,18,004 మందితో కూడిన ఈ జాబితాను https:/schooledu.telangana.gov. in లో ఉంచారు. ఈ జాబితాను లాగిన్‌ఐడీ, పాస్‌వర్డ్‌ల ఆధారంగా చూసుకునే అవకాశం కల్పించారు.