పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఖరారు

తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఖరారయ్యాయి.  www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో గ్రేడ్ల వివరాలు చూసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట

పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఖరారు

Telangana Ssc

తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల గ్రేడ్లు ఖరారయ్యాయి.  www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో గ్రేడ్ల వివరాలు చూసుకోవచ్చని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణులేనని మంత్రి చెప్పారు. మెమోలు ఆయా పాఠశాలల్లో తీసుకోవచ్చని చెప్పారు. గ్రేడ్లలో ఏవైనా పొరపాట్లు ఉంటే పాఠశాల ద్వారా ఎస్ ఎస్ సీ బోర్డుకు పంపాలని సూచించారు.

కరోనా వైరస్‌ వ్యాప్తి దృష్ట్యా  పదో తరగతి పరీక్షలను రాష్ట్రం ప్రభుత్వం రద్దు చేసింది. మార్చిలో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడగా,  ప్రభుత్వం పరీక్షలను రద్దు చేసింది. అంతర్గత మూల్యాంకనం మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

పదో తరగతి విద్యార్థులు తమ తమ గ్రేడ్లను చూసుకునేందుకు మొదట bse.telangana.gov.inలోకి లాగినై, టీఎస్‌ ఎస్ ఎస్ సీ గ్రేడ్‌లు 2020 క్లిక్‌ చేయాలి. ఆ తర్వాత ఫలితాల పేజీ వస్తుంది. అనంతరం హాల్‌ టికెట్‌ నెంబర్‌, పుట్టిన తేదీ నమోదు చేసి, సబ్మిట్‌ చేస్తే గ్రేడింగ్‌ను చూపిస్తుంది. వీటిని ప్రింట్‌ కూడా తీసుకోవచ్చు.