Gun Misfire : తుపాకీ మిస్ ఫైర్.. హెడ్ కానిస్టేబుల్ మృతి
పోలీస్ స్టేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిపార్టుమెంట్ ను షాక్ కు గురిచేస్తోంది.
Gun Misfire : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ డిపార్ట్ మెంట్ లో ఊహించని ఘటన జరిగింది. ఇల్లందు మండలం కొమరవరం పరిధిలోని కాచన పల్లి పోలీస్ స్టేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ అయింది. ఈ సంఘటనలో హెడ్ కానిస్టేబుల్ సంతోశ్ అక్కడికక్కడే మృతి చెందాడు.
Read This : Statue Of Equality : ముచ్చింతల్కు మెగాస్టార్.. భగవత్ రామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు
కాచన పల్లి పోలీస్ స్టేషన్ లో ఎప్పటిలాగే నిన్న నైట్ డ్యూటీకి వచ్చారు హెడ్ కానిస్టేబుల్ సంతోష్. ఈ తెల్లవారు జామున విధుల్లో భాగంగా ఆయుధాలను పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ సంఘటన చోటుచేసుకుందని పోలీస్ అధికారులు తెలిపారు.
హెడ్ కానిస్టేబుల్ సంతోష్ మృతదేహాన్ని ఇల్లందు ప్రభుత్వ దవాఖానాకు తరలించారు పోలీసులు. ఉన్నతాధికారుల సమక్షంలో పంచనామా నిర్వహించిన తర్వాత.. పోస్ట్ మార్టమ్ కోసం హాస్పిటల్ కు షిఫ్ట్ చేసినట్టు చెబుతున్నారు.
Read This : Hijab Row: రాజస్థాన్లోనూ హిజాబ్ రచ్చ మొదలైంది : కాంగ్రెస్ ఎమ్మెల్యే
పోలీస్ స్టేషన్ లో తుపాకీ మిస్ ఫైర్ వార్త జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. డిపార్టుమెంట్ ను షాక్ కు గురిచేస్తోంది.