Traffic Jam : ఏపీ,తెలంగాణ సరిహద్దులో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద.. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహాదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
Traffic Jam : సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద.. విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహాదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. లాక్డౌన్ విధించిన సమయంలో ఏపీ కి వెళ్లిన ప్రయాణికులు, వీకెండ్ కావటంతో తెలంగాణకు తిరిగి వస్తున్నారు. దీంతో హనాల రద్దీ బాగా పెరిగిపోయింది.
రామాపురం చెక్ పోస్ట్ వద్ద పోలీసులు ఈ-పాస్లను చెక్ చేస్తున్నారు. ఈ-పాస్ల తనిఖీలు కారణంగా రెండు కిలోమీటర్లు మేర వాహానాలు నిలిచిపోయాయి.తెలంగాణలో లాక్డౌన్ సమయాల్లో సడలింపులు ఇవ్వటంతో ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వారు తిరిగి హైదరాబాద్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రతి వాహానానినికి ఈ-పాస్ తప్పనిసరి చేయచటంతో పాస్ ఉన్నవాహానాలను మాత్రమే అనుమతిస్తున్నారు. ప్రతి వాహానాన్ని చెక్ చేస్తూ ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.