Nizamabad : పాలపొడి కోసం కొట్లాట, క్షణికావేశం ఎంత పనిచేసింది…తలపై ఇటుకతో కొట్టిన భర్త..మృతి చెందిన భార్య

కొడుక్కి పాలపొడి విషయంలో భార్య, భర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

Nizamabad : పాలపొడి కోసం కొట్లాట, క్షణికావేశం ఎంత పనిచేసింది…తలపై ఇటుకతో కొట్టిన భర్త..మృతి చెందిన భార్య

Milk

milk powder : కొడుక్కి పాలపొడి విషయంలో భార్య, భర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో..ఇటుకను తీసుకుని అమాంతం..భార్య తలపై కొట్టాడు. దీంతో తీవ్రరక్తస్రావం కావడంతో…ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమె చనిపోవడంతో కుటంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన నిజమాబాద్ జిల్లాలోని కమ్మర్ పల్లిలో చోటు చేసుకుంది.

యెల్కల గంగమణి, గంగాధర్ దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఏడాది వయస్సున్న కుమారుడున్నాడు. ప్రస్తుతం గంగమణి ఏడు నెలల గర్భిణీ. ఇంట్లో పాలపొడి లేదని, దీంతో కొడుక్కి పాలు లేకుండా పోయాయని భర్తకు చెప్పింది. వారం క్రితం చెప్పినా..పాలపొడి తీసుకరాకపోవడంతో భర్తను నిలదీసింది గంగమణి. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. క్షణికావేశంలో ఇటుకను భార్యపైకి బలంగా విసిరాడు. ఆమె తలకు తీవ్రగాయమైంది. కుటుంబసభ్యులు నిర్మల్ జిల్లా కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అందించినా..ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగుపడలేదు. బతకడం కష్టమని వైద్యులు చెప్పడంతో శనివారం స్వగ్రామానికి తీసుకొచ్చారు. మార్గమధ్యలోనే గంగమణి..తుదిశ్వాస విడిచింది. దీంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.