Ashada Bonalu : నేటితో ముగియనున్న ఆషాఢ మాస బోనాలు

ఆషాఢ మాసం బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ్టితో హైదరాబాద్‌లో బోనాల సందడి ముగియనుంది. గోల్కోండ కోటలో తొలివారం ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి.

Ashada Bonalu : నేటితో ముగియనున్న ఆషాఢ మాస బోనాలు

Ashada Bonalu

Ashada Bonalu : ఆషాఢ మాసం బోనాలు చివరి అంకానికి చేరుకున్నాయి. ఇవాళ్టితో హైదరాబాద్‌లో బోనాల సందడి ముగియనుంది. గోల్కోండ కోటలో తొలివారం ఆ తర్వాత సికింద్రాబాద్ లష్కర్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ముగిశాయి.

ఇక పాతబస్తీ లాల్ దర్వాజ అమ్మవారి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ జరిగే రంగం కార్యక్రమంతో.. లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాలు ఉత్సవాలు ముగియనున్నాయి.

ఆదివారం ఉదయం నుంచే సింహవాహిని అమ్మవారికి భక్తులు బోనాలు, మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారం రోజున పెద్ద ఎత్తున మహిళలు బోనాలు సమర్పించారు.

ఇక ఇవాళ లాల్ దర్వాజా సింహవాహిని ఆలయంలో రంగం కార్యక్రమం, అమ్మవారి అంబారీ ఊరేగింపు కార్యక్రమాలు జరుగనున్నాయి. పలహారం బండ్లు, ఘటాల ఊరేగింపుతో బోనాల వేడుకల పూర్తికానున్నాయి.