Ganesh laddu: గణపతి లడ్డు కైవసం చేసుకున్న ముస్లిం యువకుడు
బాగ్లింగంపల్లిలో వక్రతుండ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామి వారి లడ్డును ముస్లిం కైవసం చేసుకున్నారు.
Ganesh laddu: కులమతాలకు అతీతంగా పదిరోజుల పాటు పూజలు అందుకున్న వినాయకుడు నిమజ్జనానికి బయల్దేరాడు. నిమజ్జనానికి వెళ్లే ముందు ముఖ్యమైన ఘట్టంగా భావించే వినాయక లడ్డూ వేలం పాటలు ఈ ఏడాది జోరుగా సాగాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ నగరంలో చిక్కడపల్లిలో ఆసక్తకర అంశం చోటుచేసుకుంది.
బాగ్లింగంపల్లి యాదాద్రి కాలనీలో వక్రతుండ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామివారి లడ్డూ వేలం పాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రూ.72వేల 500కు అదే కాలనీకి చెందిన ముస్లిం యువకుడు ముస్తఫా లడ్డూను కైవసం చేసుకున్నారు.
ఓ ముస్లిం యువకుడు పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదంను కైవసం చేసుకోడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మతాల మధ్య సామరస్యానికి ప్రతీకగా ఈ ఘటన నిలిచిందని అభిప్రాయపడుతున్నారు.