వ్యభిచార కేసులో పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్టులు

  • Published By: murthy ,Published On : August 27, 2020 / 08:08 AM IST
వ్యభిచార కేసులో పట్టుబడ్డ జూనియర్ ఆర్టిస్టులు

కరోనా వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో అనేకమంది రోడ్డున పడ్డారు. ఉపాధిలేక ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లిన వారు కొందరు. ఇదే సమయంలో ఈజీ మనీ కోసం లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు జీడిమెట్ల పోలీసులు.



జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలోని శాపూర్ నగర్ లోని రాఘవేంద్ర లాడ్జిలో గత కొంత కాలంగా వ్యభిచారం జరుగుతోందనే సమాచారం జీడిమెట్ల పోలీసులకు అందింది. లాడ్జి పై నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం రాత్రి లాడ్జిపై దాడులు నిర్వహించారు. దాడుల్లో నలుగురు మహిళలను, నలుగురు విటులను, లాడ్జి నిర్వాహకుడు సత్యనారాయణను అదుపులోకి తీసుకున్నారు.
https://10tv.in/bandla-ganesh-about-his-family-and-cinema-industry/
పట్టుబడ్డ మహిళల్లో ఇద్దరు జూనియర్ ఆర్టిస్టు లు ఉన్నారు. విటుల్లో ఒకరు వీఆర్ఓ గా పని చేస్తున్నారు. కరోనా కారణంగా లాడ్జ్ నష్టాల్లో ఉండటంతో డబ్బుల కోసం లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్నట్లు నిర్వాహకుడు సత్యనారాయణ చెప్పాడు. వీరందరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లుజీడీమెట్ల సీఐ బాలరాజు చెప్పారు.