Gangster Nayeem Case : గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్

గ్యాంగ్‌స్టర్‌ నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్నను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Gangster Nayeem Case : గ్యాంగ్ స్టర్  నయీం ప్రధాన అనుచరుడు శేషన్న అరెస్ట్

Gangster Nayeem follower Sheshanna

Gangster Nayeem follower Sheshanna arrested : గ్యాంగ్‌స్టర్‌ నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్నను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా సమచారంతో పోలీసులు శేషన్నను అరెస్ట్ చేశారు. 2016లో గ్యాంగ్‌స్టర్‌ నయీమ్ ఎన్ కౌంటర్ తరువాత అతని కొంతమంది అనుచరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈక్రమంలో నయీం ప్రధాన అనుచరుడు శేషన్నకూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. పోలీసుల కళ్లుకప్పి తిరుగుతున్నాడు. రహస్యంగా దందాలు..సెటిల్ మెంట్లు చేస్తున్నాడు. ఈక్రమంలో శేషన్న జాడల్ని పసిగట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో అరెస్ట్ చేశారు. శేషన్న వద్ద ఉన్న 9 MM పిస్టల్ స్వాధీనం చేసుకున్నారు.

పోలీసులు కళ్లు కప్పి ల్యాండ్ సెటిల్ మెంట్లు చేస్తున్న శేషన్న..
కొంతకాలంగా ల్యాండ్ సెటిల్మెంట్లు చేస్తున్న శేషన్న సోమవారం (సెప్టెంబర్ 26,2022)కొత్తపేట్ లోని ఒక హోటల్లో సెటిల్మెంట్ చేస్తున్నాడనే సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు ఆకస్మిక దాడులు చేశేషన్నను అదుపులోకి తీసుకున్నారు. శేషన్న అరెస్టును మంగళవారం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నట్లుగా సమాచారం. నాంపల్లి కోర్టులో శేషన్నను హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నారు.

కాగా.. గ్యాంగ్‌స్టర్‌ నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత.. అతనికి సంబంధించిన చాలామందిని పోలీసులు అప్పట్లో అరెస్టులు చేశారు. కొంతమంది మాత్రం అజ్ఞాతంలోకి వెళ్లిపోగా వారిలో నయూం ప్రధాన అనుచరుడు శేషన్న కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కొంతకాలం తరువాత బయటకు వచ్చి పోలీసుల కళ్లుగప్పి తిరుగుతూ దందాలను కొనసాగిస్తున్నాడు. ఈక్రమంలో ఎట్టకేలకు శేషన్న జాడను పసిగట్టిన టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర 9ఎంఎం పిస్టల్‌ దొరకడం పలు అనుమానాలకు తావిస్తోంది. పోలీసుల దగ్గర ఉండే పిస్టల్‌ ఆయన దగ్గరకు ఎలా వెళ్లింది..? ఇప్పటివరకు శేషన్నకు ఎవరు ఆశ్రయం కల్పించారు? సెటిల్మెంట్‌లు చేయటానికి ఎవరు సహకరిస్తున్నారు? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

నయూం ఎన్ కౌంటర్ తరువాత పలు డాక్యుమెంట్లతో పాటు భారీగా నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా లెక్కలేనన్ని ఆస్తులు ఉన్నాయి నయూంకు.నయూం ఆస్థులు, డంప్‌లకు సంబంధించి అన్ని వివరాలు శేషన్నకు పూర్తిగా తెలుసని పోలీసులు భావిస్తున్నారు. ఎన్‌కౌంటర్‌ సమయంలో నయీం దగ్గర దొరికిన ఏకే–47తో పాటు అతడి డెన్ల నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, పేలుడు పదార్థాలకు సంబంధించి కూడా శేషన్న నుంచి పలు వివరాలు సేకరించనున్నారు.

తీవ్ర సంచలన కలిగించిన గ్యాంగ్ స్టర్ నయీం ఎన్​కౌంటర్..
2016 ఆగస్టు 8న షాద్​నగర్ వద్ద జరిగిన ఎన్​కౌంటర్​లో నయూం మృతిచెందాడు. అనంతరం నార్సింగిలోని నయీం నివాసంలో పోలీసులు తనిఖీలు చేయగా..అత్యంత భారీగా ఆస్తులు వెలుగు చూశాయి. నయీం ఎన్​కౌంటర్ కేసును ప్రభుత్వం.. సిట్​కు అప్పగించింది. దర్యాప్తులో నయీం బినామీల పేరు మీద ఉన్న ఆస్తులను కొన్నింటిని సిట్ గుర్తించింది. ఈక్రమంలోనే నయీం మమ్మల్ని బెదిరించి అన్యాయంగా తమ ఆస్తుల్ని లాక్కున్నాడని పలువురు బాదితులు ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. డాక్యుమెంట్లు పరిశీలించి బాధితులను తిరిగి వారి వారి ఆస్తులు ఇస్తామని అప్పట్లో ప్రకటించారు. నయీం బినామీల పేరు మీద ఉన్న ఆస్తుల పత్రాలను సిట్ కోర్టులోనూ సమర్పించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న పలు ఆస్తులను విక్రయించేందుకు నయీం భార్య పహీమ్ బేగం, అనుచరులు పాశం శ్రీను, అబ్దుల్ ఫహీమ్, నజీర్​లు ప్రయత్నించడంతో రాచకొండ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మొత్తం రూ. 150 కోట్లకు పైగా ఆస్తులను పోలీసులు సీజ్‌ చేశారు.