India-New Zealand ODI : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో కివీస్ తో టీమిండియా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది.

India-New Zealand ODI : టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్

india

India-New Zealand ODI : టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. కాసేపట్లో కివీస్ తో టీమిండియా తొలి వన్డే మ్యాచ్ ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. మూడు మ్యాచుల సిరీస్ లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగనుంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఉప్పల్ స్టేడియంలో వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగనుంది.

హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ కు సొంతగడ్డపై ఇది తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్. వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మిడిలార్డర్ లో బ్యాటింగ్ చేయనున్నారు. గాయం కారణంగా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ సిరీస్ కు దూరం కాగా, అతని స్థానంలో సూర్యకుమార్ తుది జట్టులో చోటు దక్కించుకోనున్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.

India-New Zealand ODI : నేడు ఇండియా-న్యూజిలాండ్ తొలి వన్డే క్రికెట్ మ్యాచ్.. ఉప్పల్ స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 2,500 మంది పోలీసులతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మహిళల కోసం ప్రత్యేకంగా 40 మందితో షీ టీమ్‌లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకుల్ని స్టేడియంలోకి అనుమతిస్తారు. సెల్‌ఫోన్ మినహా ఇతర వస్తువులకు స్టేడియంలోకి అనుమతి లేదు.

పాసులు, టిక్కెట్లు, బీసీసీఐ అనుమతించిన కార్డులు ఉన్న వారికి మాత్రమే స్టేడియంలోకి రావడానికి అనుమతి ఉంది. మైదానంలోకి వెళ్లి ఆటగాళ్లను అడ్డుకుంటే కఠిన చర్యలు తీసుకుంటారు. మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లను బ్లాక్‌లో అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బ్లాక్ టిక్కెటింగ్, బెట్టింగ్ జరగకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. బ్లాక్ టిక్కెట్లకు సంబంధించి ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు అయ్యాయి. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా వాహనాలకు ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేశారు.