అయోధ్య రామమందిర భూమి పూజకు చినజియర్ స్వామికి ఆహ్వానం

  • Published By: bheemraj ,Published On : August 3, 2020 / 10:59 PM IST
అయోధ్య రామమందిర భూమి పూజకు చినజియర్ స్వామికి ఆహ్వానం

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామికి అరుదైన ఆహ్వానం అందింది. బుధవారం (ఆగస్టు 5, 2020 అయోధ్యలో జరిగే రామ మందిరం భూమి పూజలో పాల్గొనాలని చిన్న జీయర్ స్వామికి ఆహ్వానం అందింది. ప్రస్తతం చిన్నజీయర్ స్వామి చాతుర్మాస దీక్షలో ఉన్నారు. ఈ నెల 5న అయోధ్యలో భవ్య రామమందిరం నిర్మాణానికి ప్రధాని మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయబోతున్నారు.



అయితే కరోనా ఉన్న నేపథ్యంలో దీనికి అత్యంత తక్కువ మంది అతిథుల మధ్య ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా అతి తక్కువ మందిలో చిన్న జీయర్ స్వామికి ఆహ్వానం అందింది. అయితే ఆయన చాతుర్మాస దీక్షలో ప్రస్తుతం కొనసాగుతున్నారు.

అతి తక్కువమంది సమక్షంలో జరిగే భవ్య రామమందిరం నిర్మాణ శంకుస్థాపనకు సంబంధించి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి కేవలం చిన్నజీయర్ స్వామికి ఒక్కరికే ఆహ్మానం అందినట్లుగా సమాచారం.



ఎల్లుండి జరుగనున్న ఈ కార్యక్రమానికి రేపటి వరకు ఎవరైనా ఆహ్వానాలు అందుతాయా? లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సివుంది. దేశ వ్యాప్తంగా 150 మందిని సెలెక్టు చేస్తారు. 150 మందిలో సాధు సముతులు, వివిధ ధార్మిక సంస్థలు ఉన్నాయి.