Bandi Sanjay: ‘ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు తగవు’

దేశ ప్రజలంతా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయం ఇది. దేశ ప్రజల ప్రాణాలను కాపాడుకునే దిశగా అందరి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఫస్ట్ వేవ్ లో అలా ప్రయత్నించి విజయం సాధించాం. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి మరోసారి..

Bandi Sanjay: ‘ఇలాంటి సమయంలో రాజకీయ విమర్శలు తగవు’

Bandi Sanjay says its not right time for political criticize: దేశ ప్రజలంతా కరోనా మహమ్మారిని ఎదుర్కొంటున్న సమయం ఇది. దేశ ప్రజల ప్రాణాలను కాపాడుకునే దిశగా అందరి ప్రయత్నాలు సాగుతున్నాయి. ఫస్ట్ వేవ్ లో అలా ప్రయత్నించి విజయం సాధించాం. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించి మరోసారి చర్యలు చేపడుతున్నాం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో పేద ప్రజలు ఆర్థిక ఇబ్బందులకు గురికావొద్దని దేశ ప్రధాని మోడీ పథకాలు ప్రవేశపెడుతున్నారు. ఆత్మ నిర్భర్ పథకం కింద 20 వేల కోట్లు విడుదల చేశారు. ఎవరూ ఆకలితో ఉండకూడదని పేద ప్రజలకు బియ్యం అందించే క్రమంలో గరీభ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్రం 15 కిలోల బియ్యం అందిస్తోంది.

ఇటువంటి కీలక సమయంలో రాజకీయ విమర్శలు చేయడం మానేసి అర్హులకు బియ్యం అందేలా చూస్తున్నాం. మొదటి డోస్, రెండో డోస్ కరోనా టీకాలు 100 శాతం విజయం సాధించాయి. డిసెంబర్ వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిపోతుంది.