జనసేనాని Metro ప్రయాణం, ద్రాక్షారామం రైతుతో ముచ్చట్లు

  • Published By: madhu ,Published On : November 5, 2020 / 12:57 PM IST
జనసేనాని Metro ప్రయాణం, ద్రాక్షారామం రైతుతో ముచ్చట్లు

Janasenani Metro journey : సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మెట్రోలో ప్రయాణం చేశారు. 2020, నవంబర్ 04వ తేదీ గురువారం ఉదయం హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణం చేశారు. మాదాపూర్ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు ప్రయాణించారు. వకీల్ సాబ్ షూటింగ్ నిమిత్తం మియాపూర్ వెళ్లారు. సాధారణ ప్రయాణికుడిలా మెట్రో స్టేషన్ లో చెకింగ్ ప్రక్రియను, ఎంట్రీ విధానాన్ని పాటించారు.



ఈ మెట్రో ప్రయాణంలో భాగంగా అమీర్ పేట స్టేషన్లో ట్రైన్ మారారు పవన్. ఈ సందర్భంలో తోటి ప్రయాణికులతో ముచ్చటించారు. మియాపూర్ వెళ్లే ట్రైన్ లో పవన్ కళ్యాణ్ పక్కన ద్రాక్షారామం, సత్యవాడ ప్రాంతాల వారు కూర్చున్నారు. ద్రాక్షారామం చెందిన చిన సత్యనారాయణ అనే రైతుతో పవన్ మాట్లాడారు. పంటల గురించి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.



https://10tv.in/pawan-kalyan-travels-in-hyderabad-metro-rail/
ఇటీవలి వర్షాలకు వ్యవసాయం బాగా దెబ్బతిందని, తమ ప్రాంతంలోనూ, కుటుంబంలోనూ చాలామంది అభిమానులు ఉన్నారని చిన సత్యనారాయణ చెప్పారు. ప్రయాణంలో కలవడం చాలా సంతోషంగా ఉందని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.



మెట్రో ట్రైన్ ప్రయాణం తనకు మొదటిసారి అని ఆ రైతు చెప్పగానే పవన్ కళ్యాణ్ నవ్వుతూ మీకే కాదు నాకు కూడా మెట్రో ప్రయాణం ఇదే మొదటిసారి అన్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు..చిత్ర నిర్మాత శ్రీ దిల్ రాజు, ఇతరులున్నారు