Minister Gangula Kamalakar : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయించిన నిధులతో కరీంనగర్ స్మార్ట్ సిటీ అభివృద్ధి చెందుతుందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ ను సుందర నగరంగా తీర్చి దిద్ధేందుకు సీఎం అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. 12 కోట్లతో క్రీడ మైదానం ఏర్పాటు చేశామని తెలిపారు.
కోటి 55 లక్షలతో రినోవేషన్ చేసుకున్నామని చెప్పారు. త్వరలోనే స్కిల్ డెవలప్ బిల్డింగ్ భవనం పూర్తి చేసుకుంటామని పేర్కొన్నారు. ఇంకా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ టూరిజం స్పాట్ గా అభివృద్ధి చెందుతుందన్నారు.