Teachers Transfer : ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊపాధ్యాయల బదిలీలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు.

Teachers Transfer : ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

transfer of teachers

Teachers Transfer : రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఊపాధ్యాయల బదిలీలో హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. జీవో 317లో బదిలీ అయిన ఉపాధ్యాయులకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి 14 వరకు ఆన్ లైన్ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు.

తెలంగాణలో గత కొద్ది రోజులుగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరుగుతోంది. ఎస్ జీటీలు, స్కూల్ అసిస్టెంట్లు, ల్యాంగేజీ పండిట్లను బదిలీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే బదిలీలకు సంబంధించిన నిబంధనల్లో కనీసం ఒకే చోట రెండేళ్లు పని చేసిన వారు మాత్రమే బదిలీకి దరఖాస్తు చేసుకునేందుకు అర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది.

Telangana Govt Green Signal : టీచర్ల దంపతుల కేటగిరి బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఇటీవల ఉమ్మడి జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు 317 జీవో ప్రకారం బదిలీ అయిన వారికి రెండేళ్ల సర్వీస్ పూర్తిగా లేదు. దీంతో తాము ఉమ్మడి జిల్లా నుంచి కొత్త జిల్లాలకు వచ్చామని ఉమ్మడి జిల్లాలోని సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని వారు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో హైకోర్టును ఆశ్రయించారు.

హైకోర్టు.. వారి అభ్యర్థనను పరిశీలించి ఇలాంటి ఉపాధ్యాయులు దాదాపు 25 వే లమంది ఉన్నందున ప్రభుత్వం పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో ఉమ్మడి జిల్లాలో సర్వీసు కలిపి రెండేళ్లు పూర్తైన వారికి బదిలీల కోసం దరఖాస్తు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు.