KTR-TSPSC: ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నపత్నాల లీక్: మంత్రి కేటీఆర్

బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)లో లీకేజీ కేసు, దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్ లో 13 సార్లు క్వశ్చన్ పేపర్లు లీకు అయ్యాయని తెలిపారు. మరి ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్ కు ఉందా? అని నిలదీశారు.

KTR-TSPSC: ఆ రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నపత్నాల లీక్: మంత్రి కేటీఆర్

KTR-TSPSC

KTR-TSPSC: బీజేపీ ప్రభుత్వాలున్న రాష్ట్రాల్లో ఇప్పటికే వందసార్లకు పైగా ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)లో లీకేజీ కేసు, దీనిపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. స్వయంగా ప్రధాని మోదీ రాష్ట్రం గుజరాత్ లో 13 సార్లు క్వశ్చన్ పేపర్లు లీకు అయ్యాయని తెలిపారు. మరి ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్ కు ఉందా? అని నిలదీశారు.

నిరుద్యోగ యువకుల ప్రయోజనాలు కాపాడటమే తమ ప్రభుత్వం లక్ష్యమని కేటీఆర్ చెప్పారు. ఇందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను టీఎస్‌పీఎస్సీకి అందిస్తామని తెలిపారు. రెచ్చగొట్టే రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కాకుండా, ఉద్యోగాల సాధన పైనే యువత దృష్టిపెట్టాలని విజ్ఞప్తి చేశారు. టీఎస్‌పీఎస్సీ రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ అని అన్నారు.

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక ప్రభుత్వ శాఖ కాదని కేటీఆర్ చెప్పారు. ఈ కనీస అవగాహన కూడా బండి సంజయ్ కి లేదని విమర్శించారు. బండి సంజయ్ అజ్ఞాని అని అన్నారు. ప్రభుత్వాల పనితీరు, వ్యవస్థల గురించి అవగాహనలేని నాయకుడు బండి సంజయ్ అని కేటీఆర్ మండిపడ్డారు. ఒక వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారని చెప్పారు.

నిరుద్యోగులను రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేసేలా రాజకీయాలను చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. తమ పార్టీ ప్రయోజనాల కోసం, యువత ఉద్యోగాల ప్రిపరేషన్ పక్కన పడేయాలన్న దుర్మార్గుడు బండి సంజయ్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుద్యోగుల పట్ల తమ నిబద్ధతను ప్రశ్నించే నైతిక హక్కు బీజేపీకి లేదని చెప్పారు.

TSPSC-Group I: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌, ఏఈఈ, డీఏవో పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం