KBC: అమితాబ్ సమక్షంలో కేటీఆర్ ట్వీట్‌కు గంగూలీ – సెహ్వాగ్ ఆన్సర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలపై కూడా ఫోకస్ పెట్టే ఈ మంత్రి అప్పుడప్పుడు ఇదే వేదికగా..

KBC: అమితాబ్ సమక్షంలో కేటీఆర్ ట్వీట్‌కు గంగూలీ – సెహ్వాగ్ ఆన్సర్

Kbc

KBC: తెలంగాణ మంత్రి కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ట్విట్టర్ వేదికగా ప్రజల సమస్యలపై కూడా ఫోకస్ పెట్టే ఈ మంత్రి అప్పుడప్పుడు ఇదే వేదికగా చమత్కారాలు కూడా రాసుకొస్తారు. అలా కరోనా మహమ్మారికి కొత్త కొత్త మందులు, సామాన్య ప్రజలకు నోరు తిరగని పేర్లతో వచ్చిన కరోనా మందులను తన ట్వీట్ లో రాసుకొచ్చిన కేటీఆర్ వీటిని సక్రమంగా ఎవరైనా పలికేవాళ్లు ఉన్నారా అని ట్వీట్ చేశారు. దీనికి సీనియర్ లీడర్, మాజీ ఎంపీ శశిథరూర్ ని ట్యాగ్ చేసిన కేటీఆర్ ఇది ఆయన మాత్రమే పలకగలరన్నారు.

అప్పుడు ఆ ట్వీట్ వైరల్ కాగా.. ఇప్పుడు మళ్ళీ అదే ట్వీట్ వైరల్ గా మారింది. అందుకు కారణం అప్పుడు కేటీఆర్ సరదాగా చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు కౌన్ బనేగా కరోడ్ పతి షోలో ప్రశ్నగా మారింది. బిగ్ బీ అమితాబ్ హోస్ట్ చేస్తున్న కేబీసీకి టీం ఇండియా మాజీ క్రికెటర్లు సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్ రాగా వారికి ఈ ప్రశ్న సంధించారు. అయితే.. సౌరవ్ గంగూలీ కూడా అంతే తెలివిగా సరైన సమాధానం చెప్పారు.

అప్పుడు కేటీఆర్ ట్వీట్ చేసిన నోరు తిరగని కోవిడ్ 19 మెడిసిన్ లిస్ట్‏ను ఎవరికి ట్యాగ్ చేశారంటూ ప్రశ్నిస్తూ.. నలుగురి పేర్లను ఆప్షన్స్‏గా ఇచ్చారు అమితాబ్ . అందులో ఒకరు కపిల్ సిబల్, సుబ్రమణ్యన్ స్వామి, అమితావ్ గోష్, శశిథరూర్ కాగా.. దీనిపై సౌర‌వ్ తెలివిగా శ‌శి థ‌రూర్ కు ఇంగ్లీష్‌పై బాగా పట్టు ఉందని.. అందుకే ఆయ‌న పేరు గెస్ చేసి చెప్పారు. ఇది కరెక్ట్ ఆన్సర్ కావడంతో రూ.40 వేల రూపాయలు గెలుచుకున్నారు. ఇప్పుడు తన ట్వీట్ కేబీసీలో రావడంపై స్పందించిన కేటీఆర్ ఒకవైపు ఆశ్చర్యాన్ని, మరోవైపు సంతోషాన్ని వ్యక్తం చేశారు.