ప్రేమ వివాహం : యువకుడిపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన అమ్మాయి తరపు బంధువులు

ప్రేమ వివాహం : యువకుడిపై రాళ్లు, కర్రలతో దాడి చేసిన అమ్మాయి తరపు బంధువులు

Love marriage : girl’s Relatives attacked a young man  : ప్రేమ వివాహం చేసుకున్నాడనే నెపంతో ఓ యువకుడిపై దాడి చేసిన ఘటన సూర్యాపేట జిల్లా మర్రికుంటలో జరిగింది. స్థానికంగా ఉండే వినయ్.. దూపహాడ్‌కు చెందిన రుచితను ప్రేమించి ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకున్నాడు. అయితే.. ఈ పెళ్లి ఇష్టంలేని రుచిత బంధువులు… వినయ్ ఇంటిపై దాడికి పాల్పడ్డారు. రాళ్లు, కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపర్చారు.

వినయ్, రుచిత నిన్న ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ పెళ్లిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు ఘర్షణకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తోపులాట సందర్భంగా వరుడు వినయ్ కు గాయాలైనట్లు సమాచారం.

తల్లిదండ్రులు కొంత సుముఖంగా ఉన్నప్పటికీ కొంత సమయం ఇవ్వాలని అడిగిన సందర్భంలో అతను తల్లిదండ్రుల మాట వినకుండా వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జరిగిన తోపులాటలో ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు కుటుంబాలు సయోధ్యకు రావడంతో పోలీసులు ఇప్పటివరకు అయితే కేసు నమోదు చేయలేదని సమాచారం.

వివాహం చేసుకోవడం పట్ల తమకు అభ్యంతరం లేదని.. అయితే కొంతకాలం ఆగాలని చెప్పినట్లు ఇరు కుటుంబాల సభ్యులు చెబుతున్నారు. ఆర్య సమాజ్ లో వివాహం చేసుకోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాము వివాహం చేయాలనుకున్నామని..కానీ వారి తొందరపాటు వల్లే ఆగ్రహానికి గురికావాల్సివచ్చిందన్నారు.