Malkajgiri Murder Case : దారుణం.. ఆమెను పెళ్లి చేసుకున్నాడని చంపేశాడు, వీడిన రైల్వే ఉద్యోగి మర్డర్ మిస్టరీ

హైదరాబాద్ మల్కాజిగిరి పీవీఎన్‌ కాలనీకి చెందిన రైల్వే ఉద్యోగి విజయ్‌కుమార్‌ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. విజయ్ మర్డర్ కు కారణం ఏంటో తెలిసి పోలీసులు విస్తుపోయారు.

Malkajgiri Murder Case : దారుణం.. ఆమెను పెళ్లి చేసుకున్నాడని చంపేశాడు, వీడిన రైల్వే ఉద్యోగి మర్డర్ మిస్టరీ

Malkajgiri Murder Case

Malkajgiri Murder Case : హైదరాబాద్ మల్కాజిగిరి పీవీఎన్‌ కాలనీకి చెందిన రైల్వే ఉద్యోగి విజయ్‌కుమార్‌ మర్డర్ కేసులో మిస్టరీ వీడింది. విజయ్ మర్డర్ కు కారణం ఏంటో తెలిసి పోలీసులు విస్తుపోయారు. తాను పెళ్లాడాల్సిన యువతిని విజయ్ వివాహం చేసుకున్నాడనే పగతో అతడిని చంపేశాడు. ఈ కేసులో పోలీసులు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని గురువారం(మే 27,2021) అరెస్టు చేశారు.

విజయ్‌కుమార్‌(30) రైల్వే వర్కుషాపు ఉద్యోగి. లాలాగూడలోని రైల్వే వర్క్ షాప్ లో ఎలక్ట్రికల్ సెక్షన్ లో పని చేస్తాడు. విశాఖపట్నానికి చెందిన భవ్యతో 2013లో వివాహమైంది. మే నెలలో విజయ్‌కుమార్‌ తల్లికి కరోనా సోకడంతో ముందు జాగ్రత్తగా భార్యను పుట్టింటికి పంపాడు. ఈ నెల 8న ఉదయం విజయ్‌కుమార్‌.. తన సోదరితో వీడియోకాల్‌ మాట్లాడుతున్నాడు. విజయ్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తి తలుపు నెట్టుకొని లోపలికి వచ్చాడు. వేట కొడవలితో దాడి చేయడంతో విజయ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. వీడియో కాల్ లో ఇదంతా చూసిన విజయ్ సోదరి షాక్ కి గురైంది. ఆ వెంటనే స్థానికులకు ఫోన్ చేసి విషయం చెప్పింది. వారు వచ్చి చూసే సరికే విజయ్ చనిపోయాడు.

పక్కా ప్లాన్ తో మర్డర్:
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మర్డర్ సంచలనం రేపింది. అసలు ఆ వ్యక్తి ఎవరు? ఎందుకు విజయ్ ని చంపాడు? అనేది మిస్టరీగా మారింది. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫుటేజీలోని గుర్తుతెలియని వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడిని భవ్య బంధువు గుడ్డ శ్రీనివాస్‌రెడ్డి(30)గా విజయ్ బంధువులు గుర్తించారు. నిందితుడిది విశాఖలోని మద్దిపాలెం. డెహ్రాడూన్‌ ఆర్మీ రెజిమెంట్‌లో సిపాయిగా పని చేస్తున్నాడు.

సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తానే హత్య చేసినట్టు శ్రీనివాస్ పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. తాను పెళ్లాడాల్సిన యువతిని విజయ్ వివాహం చేసుకున్నాడని, ఆ పగతో అతడిని చంపేశానని చెప్పాడు.

భవ్యను తొలుత శ్రీనివాస్ కే ఇచ్చి పెళ్లి చేయాలని భావించారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు కానీ, విజయ్‌కుమార్‌తో వివాహం చేశారు. అప్పటి నుంచి విజయ్‌పై శ్రీనివాస్ పగ పెంచుకున్నాడు. విజయ్ ను చంపేస్తే భవ్య తిరిగి తన దగ్గరికే వస్తుందని భావించాడు. సమయం కోసం వేచి చూశాడు. ఇంతలో భవ్య వైజాగ్‌ వచ్చిన విషయం తెలుసుకున్నాడు. మే 5న శ్రీనివాస్ వైజాగ్‌ నుంచి హైదరాబాద్ కి వచ్చాడు. మూడు రోజుల పాటు రెక్కీ నిర్వహించాడు. సికింద్రాబాద్‌లో వేట కొడవలి కొన్నాడు. మే 8న విజయ్ ని హత్య చేశాడు. ఆ తర్వాత ఎవరి కంటపడకుండా విశాఖకు వెళ్లిపోయాడు.