వరుసకు సోదరుడితో శారీరీక సంబంధం..ప్రియుడితో కలిసి చంపేసింది

వరుసకు సోదరుడితో శారీరీక సంబంధం..ప్రియుడితో కలిసి చంపేసింది

warangal triangle love story : వరుసకు సోదరుడయ్యే వ్యక్తిని ప్రేమించింది. శారీరక సంబంధం ఏర్పరచుకుంది. అంతకముందే..ఆ సోదరుడి స్నేహితుడిని కూడా ప్రేమించింది. కానీ..తమ వ్యవహారం సాఫీగా కొనసాగాలంటే..తొలుత ప్రేమించిన వ్యక్తిని అంతమొందిస్తే…బాగుంటుందని సోదరుడిని ఒప్పించి..మట్టుపెట్టించింది. ఈ ఘటన వరంగల్ జిల్లా అర్బన్ జిల్లా..కేంద్రంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలను వరంగల్ ఏసీపీ కలకోట గిరికుమార్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఇద్దరితో సంబంధం :-
వరంగల్‌ దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్‌షిప్‌కు లో నివాసం ఉంటున్న కోమటి విజయ్, రెడ్డిమల్ల రాంకీ స్నేహితులు. వీరిద్దరూ ఒకరి ఇంటికి మరొకరు వెళ్లేవారు. ఈ క్రమంలో..కాజీపేటకు చెందిన రెడ్డిమల్ల యామిని పరిచయమైంది. విజయ్ తో ఆమె ప్రేమలో పడగా..వీరి వివాహానికి కుటుంబసభ్యులు నో చెప్పారు. అయినా..ఇద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అదే సమయంలో వరుసకు తమ్ముడైన రాంకీతోనూ యామిని శారీరక సంబంధం కొనసాగించింది. డాక్టర్స్ కాలనీలో అద్దె ఇల్లు తీసుకుని సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే..ఓ రోజు రాంకీ..తన స్వగ్రామమైన వర్ధన్నపేటకు యామినిని తీసుకెళ్లాడు. ఇద్దరూ మద్యం తాగి గొడవపడ్డారు. తాను విజయ్‌తో కలిసినప్పటి ఫొటోలను స్నేహితులకు పంపిస్తున్నాడని, అతడి అడ్డు తొలగించాలని, దీంతో తమ సంబంధం సాఫీగా సాగుతుందని సోదరుడిని ఒప్పించింది.

ప్లాన్

దీంతో విజయ్ ను హత్య చేసేందుకు వ్యూహరచనలు చేశారు. 2021, జనవరి 04వ తేదీన విజయ్ ను తన ఇంటికి పిలిచాడు రాంకీ. కారులో వీరిద్దరూ తిరిగారు. అనంతరం తెల్లారి అంటే..05వ తేదీన..గీసుకొండ..శివారు కాకతీయ కెనాల్ వద్దకు వచ్చి ఇద్దరూ కల్లు తాగారు. మత్తులో ఉన్న విజయ్ ముఖంపై దాడి చేశాడు రాంకీ. కెనాల్ లోకి తోసివేసి వెళ్లిపోయాడు. ఈనెల 7న వరంగల్‌ రూరల్‌ జిల్లా సంగెం మండలం కొత్తగూడెం శివారులోని కాకతీయ కెనాల్‌లో మృతదేహం కొట్టుకవచ్చింది. గుర్తు తెలియని వ్యక్తిగా పోలీసులు కేసు నమోదు చేశారు. తన కొడుకు కనబడడం లేదని విజయ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మృతదేహం విజయ్ దని పోలీసులు తేల్చారు. అనంతరం దర్యాప్తు చేపట్టగా..అసలు విషయం బయటపడింది. రాంకీ, యామినిని శనివారం అరెస్టు చేశారు.