బ్యాంక్ నుంచి వచ్చామంటూ ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారం, హైదరాబాద్‌లో దారుణం

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అత్యాచారం జరిగింది. బ్యాంక్ నుంచి వచ్చామంటూ ఇంట్లోకి చొరబడి యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

బ్యాంక్ నుంచి వచ్చామంటూ ఇంట్లోకి చొరబడి యువతిపై అత్యాచారం, హైదరాబాద్‌లో దారుణం

raped young woman in hyderabad: హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో యువతిపై అత్యాచారం జరిగింది. బ్యాంక్ నుంచి వచ్చామంటూ ఇంట్లోకి చొరబడి యువతిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు.

ప్రైవేట్ బ్యాంకు ఉద్యోగినంటూ ఓ ఇంట్లోకి చొరబడిన వ్యక్తి యువతిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్‌ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డీఎస్‌ మక్తాలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఇటీవల కుటుంబ సభ్యులు మహారాష్ట్రకు వెళ్లగా యువతి(23) ఇంట్లోనే ఉంటోంది. మంగళవారం(మార్చి 9,2021) సాయంత్రం ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు యువతి ఇంటికి వచ్చారు.

తాము ప్రైవేటు బ్యాంకు ఉద్యోగులమని, ఫైనాన్స్‌ ఇస్తామని ఆమెతో చెప్పారు. యువతిని మాటల్లో పెట్టారు. ఇంతలో ఒకడు లోనికి చొరబడ్డాడు. మరొకడు ఇంటి బయట కాపలాగా ఉన్నాడు. ఆపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తనకే పాలసీ అవసరం లేదని ఆ యువతి చెప్పినా వినకుండా ఇంట్లోకి దూసుకెళ్లాడు ఆ నీచుడు. అనంతరం ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వాడు రెచ్చిపోయాడు.

ఘటనపై యువతి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కేసును ఛేదించడానికి పోలీసులు ఘటనా ప్రాంతంలోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

అగంతకులు ఆ ఇంట్లోకి మాత్రమే రావడం, అది కూడా ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకొని రావడం అనుమానాలకు తావిస్తోంది. ఆ యువతిని వారు కొంతకాలంగా వెంబడిస్తున్నారా? కుటుంబసభ్యులు ఎవరూ లేరని నిర్ధారించుకున్నాకే.. ఈ ఘాతుకానికి తెగబడ్డారా? ఇలా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మొత్తంగా ఈ ఘటన హైదరాబాద్‌లో సంచలనం రేపింది. స్థానికులను భయాందోళనకు గురి చేసింది. ఆడపిల్లల తల్లిదండ్రులను కంగారు పెట్టించింది. ఒంటరిగా ఇంట్లో ఉండే మహిళల్లో వణుకు పుట్టించింది.