చేయని తప్పుకు చనిపోతున్నా.. వాట్సప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్యాయత్నం

చేయని తప్పుకు చనిపోతున్నా.. వాట్సప్ స్టేటస్ పెట్టి ఆత్మహత్యాయత్నం

Man Suicide Attempt: చేయని నేరానికి బలైపోతున్నా అంటూ వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు ఓ యువకుడు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కమలాపూర్‌ మండలం భీంపల్లికి చెందిన చింతల ప్రసాద్‌ తన వ్యవసాయ పనుల నిమిత్తం అదే గ్రామానికి చెందిన బొంకూరి కుమార్, అతని చిన్నాన్న కొడుకు రమేష్‌ను తీసుకుని వెళ్లేవాడు.

ఈ క్రమంలోనే గత నెల 30 వతేదీ రాత్రి ప్రసాద్‌ తన ఇంటికి కుమార్‌తో పాటు రమేష్‌ను తీసుకువెళ్లాడు. మరో యువకుడు పూర్ణచందర్‌తో కలిసి వీరంతా పార్టీ చేసుకుని రాత్రికి అక్కడే పడుకున్నారు. తెల్లవారి ప్రసాద్‌తో కలిసి కుమార్, రమేష్ పొలం వెళ్లారు.

తర్వాత పూర్ణ చందర్‌ను దించడానికి ప్రసాద్‌ వెళ్లి తిరిగి వచ్చేసరికి బీరువాలోని ఏడున్నర తులాల బంగారు నగలు మాయం అయ్యాయి. కుమార్, రమేష్‌ను అడగ్గా, తెలియదని చెప్పారు. దీంతో ప్రసాద్‌ జనవరి 1న కమలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమార్, రమేష్‌ను పోలీసులు రెండు రోజులు విచారించి జనవరి 2వ తేదీన సాయంత్రం విడిచిపెట్టారు.

పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వచ్చినందుకు మనస్థాపానికి గురైన కుమార్.. చేయని నేరానికి నా జీవితం బలి అవుతుంది. మిస్ యూ My Friends.. ప్రాణం కంటే పరువు ముఖ్యం అని నా అర్థం అంటూ వాట్సాప్‌ స్టేటస్‌ పెట్టి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు 108 ద్వారా హన్మకొండలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.