Marriage Day: పెళ్లి రోజే విషాదం.. మహిళ ఆత్మహత్య
ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిస్తున్నారు. కానీ ఇంటి గదుల నిర్మాణం విషయంలో జరిగిన వివాదం మహిళ ఆత్మహత్యకు దారి తీసింది. ఘటన వివరాల్లోకి వెళితే.. నారాయణపేటకు చెందిన శిరీష అలియాస్ శివ జ్యోతి(28), మక్తల్కు చెందిన అశోక్గౌడ్లు ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు.
Marriage Day: ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా సాగిస్తున్నారు. కానీ ఇంటి గదుల నిర్మాణం విషయంలో జరిగిన వివాదం మహిళ ఆత్మహత్యకు దారి తీసింది. ఘటన వివరాల్లోకి వెళితే.. నారాయణపేటకు చెందిన శిరీష అలియాస్ శివ జ్యోతి(28), మక్తల్కు చెందిన అశోక్గౌడ్లు ఆరేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్ కు సమీపంలోని జగద్గిరిగుట్టలో రాజీవ్ గృహకల్ప సముదాయంలోని 20వ బ్లాక్లో నివాసం ఉంటున్నారు.
అశోక్ గౌడ్ ఆర్టీసీ జీడిమెట్ల డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నాయి. కాగా ఆదివారం వీరి పెళ్లిరోజు కావడంతో ఉదయాన్నే గుడికి వెళ్లివచ్చారు. రాజీవ్ గృహకల్పలో చాలామంది కొత్తగదులు నిర్మిస్తున్నారు. ఈ విషయంలోనే శివ జ్యోతి, అశోక్ చర్చించుకున్నారు. ఇంటికి కొంచం జరిపి కట్టుకుందామని శివజ్యోతి భర్తను కోరింది. ఈ విషయంలోనే వీరిద్దరి మధ్య వివాదం జరిగింది. కొద్దిసేపటి తర్వాత అశోక్ సంతకం చేసేందుకు జీడిమెట్ల డిపోలోకు వెళ్ళాడు. ఇదే సమయంలో శివజ్యోతి ఇంట్లో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త వచ్చి చూసేసరికి ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది.
దీంతో చుట్టుపక్కల వారికి విషయం తెలిపాడు.. వారు వచ్చి పరిశీలించి అప్పటికే శివజ్యోతి చనిపోయినట్లు నిర్దారించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. పెళ్లిరోజే శివజ్యోతి మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.