తెలంగాణలో కరోనా, 24 గంటల్లో 1,273 కేసులు, కోలుకున్నది 1,708
COVID 19 in Telangana : తెలంగాణలో గత 24 గంటల్లో కరోనా కేసులు 1,273 కేసులు నమోదయ్యాయి. కోలుకున్నది 1,708గా వెల్లడించింది తెలంగాణ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ సంచాలకులు. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 30 వేల 274గా ఉందని, కోలుకున్న కేసుల సంఖ్య 2 లక్షల 09 వేల 034గా ఉందని తెలిపింది.
24 గంటల్లో 5గురు మరణించినట్లు, కేసు మరణాల రేటు విషయానికి వస్తే..056గా ఉందని తెలిపింది. మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 19 వేల 937 ఉండగా, గృహ/సంస్థల ఐసోలేషన్ లో గల వ్యక్తుల సంఖ్య 16 వేల 809గా వెల్లడించింది.
జిల్లాల వారీగా కేసులు : –
ఆదిలాబాద్ 15. భద్రాద్రి కొత్తగూడెం 69. జీహెచ్ఎంసీ 227. జగిత్యాల 23. జనగామ 12. జయశంకర్ భూపాలపల్లి 16. జోగులాంబ గద్వాల 12. కామారెడ్డి 30. కరీంనగర్ 55. ఖమ్మం 75. కొమరం భీం ఆసిఫాబాద్ 07. మహబూబ్ నగర్ 24.
మహబూబాబాద్ 21. మంచిర్యాల 24. మెదక్ 16. మేడ్చల్ మల్కాజ్ గిరి 104. ములుగు 18. నాగర్ కర్నూలు 27. నల్గొండ 76. నారాయణపేట 03. నిర్మల్ 12. నిజామాబాద్ 30. పెద్దపల్లి 25. రాజన్న సిరిసిల్ల 32. రంగారెడ్డి 102. సంగారెడ్డి 24. సిద్దిపేట 41. సూర్యాపేట 31. వికారాబాద్ 10. వనపర్తి 21. వరంగల్ రూరల్ 22. వరంగల్ అర్బన్ 51. యాదాద్రి భువనగిరి 18.
మొత్తం : 1273
Telugu Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 24.10.2020)@Eatala_Rajender @TelanganaHealth @GHMCOnline pic.twitter.com/ZzsQ45ZMfl
— Dr G Srinivasa Rao (@drgsrao) October 24, 2020