Telangana Corona : 24 గంటల్లో 3,590 కేసులు.. కోలుకున్నది 3,555 మంది, ఇద్దరు మృతి

తాజాగా...24 గంటల్లో 3 వేల 590 మంది కరోనా బారిన పడ్డారని, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40 వేల 447 యాక్టివ్ కేసులుండగా

Telangana Corona : 24 గంటల్లో 3,590 కేసులు.. కోలుకున్నది 3,555 మంది, ఇద్దరు మృతి

Telangana Corona

Telangana Corona New Cases : తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఇంకా విస్తరిస్తూనే ఉంది. ప్రతి రోజు గణీయంగా పాజిటివ్ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమౌతోంది. వివిధ జిల్లాల్లో అత్యధికంగా కేసులు నమోదవుతుండడంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కరోనా వేరియంట్ తో పాటు ఒమిక్రాన్ కూడా భయపెడుతోంది. బుధవారం 3 వేల 801, గురువారం 3 వేల 944 పాజిటివ్ కేసులు ఉంటే.. శుక్రవారం 3 వేల 877 కేసులు నమోదయ్యాయి. తాజాగా…24 గంటల్లో 3 వేల 590 మంది కరోనా బారిన పడ్డారని, ఇద్దరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 40 వేల 447 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 4 వేల 085 మంది చనిపోయారని పేర్కొంది. అలాగే…ఒక్కరోజులో 3 వేల 555 మంది ఆరోగ్యవంతంగా కోలుకున్నారని..ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 7,14,034గా ఉందని పేర్కొంది.

Read More : Padmarajan : 226 సార్లు ఓటమి.. అయినా తగ్గేదేలే.. 227వ సారి ఎన్నికల బరిలోకి..

జిల్లాల వారీగా కేసులు : – ఆదిలాబాద్ 47, భద్రాద్రి కొత్తగూడెం 105, జీహెచ్ఎంసీ 1160, జగిత్యాల 57, జనగాం 42, జయశంకర్ భూపాలపల్లి 31, జోగులాంబ గద్వాల 28, కామారెడ్డి 42, కరీంనగర్ 119, ఖమ్మం 121, కొమురం భీమ్ ఆసిఫాబాద్ 22, మహబూబ్ నగర్ 71, మహబూబాబాద్ 46, మంచిర్యాల 79, మెదక్ 47, మేడ్చల్ మల్కాజ్ గిరి 257, ములుగు 22, నాగర్ కర్నూలు 45, నల్గొండ 98, నారాయణపేట 26, నిర్మల్ 47, నిజామాబాద్ 67, పెద్దపల్లి 63, రాజన్న సిరిసిల్ల 41, రంగారెడ్డి 215, సంగారెడ్డి 118, సిద్ధిపేట 115, సూర్యాపేట 98, వికారాబాద్ 53, వనపర్తి 53, వరంగల్ రూరల్ 45, హన్మకొండ 132, యాదాద్రి భువనగిరి 78. మొత్తం : 3,590