Telangana Assembly : ఏడుగురే అంటూ హేళనచేస్తారా?వచ్చే అసెంబ్లీలో 15మంది ఎమ్మెల్యేలతో అడుగుపెడతాం : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్

మీకున్నది ఏడుగురు ఎమ్మెల్యేలే అంటూ హేళనచేస్తారా?వచ్చే అసెంబ్లీలో 15మంది ఎమ్మెల్యేలతో అడుగుపెడతాం అంటూ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ కీలక వ్యాఖ్యలు. మంత్రి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.

Telangana Assembly : ఏడుగురే అంటూ హేళనచేస్తారా?వచ్చే అసెంబ్లీలో 15మంది ఎమ్మెల్యేలతో అడుగుపెడతాం : ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్

BRS Vs MIM in telangana assembly

Telangana Assembly : అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ సీరియస్ గా తీసుకున్నారు. మీకున్నదిన్న ఏడుగురు ఎమ్మెల్యేలే మరి ఎంత సమయం ఇస్తారు? అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను అక్బరుద్ధీన్ సీరియస్ గా తీసుకున్నారు. మీకున్నది ఏడుగురు ఎమ్మెల్యేలే అంటూ తక్కువ చేసి మాట్లాడతారా? సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడటానికి సరిపడా సమయం కూడా ఇవ్వరా? అయితే వచ్చే ఎన్నికల్లో 15మంది ఎమ్మెల్యేలతో అడుగుపెడతాం అంటూ అక్బరుద్ధీన్ అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ కు కౌంట్ సమాధానం చెప్పారు.

అసెంబ్లీలో మాట్లాడటానికి సమయం తక్కువ ఇస్తున్నారని..సమస్యల గురించి ప్రస్తావించటానికి కూడా సమయం సరిపోవటంలేదని కాబట్టి మాకు సమయం సరిపడా ఇవ్వాలని స్పీకర్ ని కోరారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఒవైసీ. దానికి మంత్రి కేటీఆర్ మీకున్నది ఏడుగురు ఎమ్మెల్యేలే..మరి ఎంత సమయం ఇస్తారు?అని అన్నారు.ఈ వ్యాఖ్యలు సీరియస్ గా తీసుకున్న అక్బరుద్ధీన్ వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కనీసం 50 స్థానాల్లో పోటీ చేస్తామని 15మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెడతాం అని స్పష్టంచేశారు. 50 స్థానాల్లో పోటీ చేయటానికి మా పార్టీ అధ్యక్షుడితో మాట్లాడతామని అని తెలిపారు అక్బరుద్ధీన్.

Telangana Assembly : అసెంబ్లీలో BRS Vs MIM.. అక్బరుద్దీన్, కేటీఆర్ మధ్య మాటల యుద్ధం

కాగా ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ పై ధన్యవాద తీర్మానం సందర్భంగా బీఆర్ఎస్-ఎంఐఎం మధ్య మాటల యుద్ధం నడిచింది. ఎమ్మెల్యే అక్బరుద్ధీన్, మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. అసెంబ్లీలో హామిలు ఇస్తారు కానీ వాటిని అమలు చేయరు అంటూ అక్బరుద్ధీన్ విమర్శించారు. సీఎం గానీ, మంత్రులు గానీ మమ్మల్ని కలవరు బీఏసీలో ఇష్టమొచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారని 25 ఏళ్లలో ఇటువంటి సభను చూడలేదంటూ అక్బరుద్ధీన్ విమర్శించారు. ఇక పాతబస్తీకి మెట్రో సంగతేంటి?. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని అక్బరుద్దీన్ అంటూ ప్రశ్నించారు. అక్బరుద్ధీన్ విమర్శలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఎంఐఎంకు ఉన్నది ఏడుగురు ఎమ్మెల్యేలు. మరి ఎంత సమయం ఇస్తారు? అంటూ ప్రశ్నించారు.ఏడుగురు సభ్యులున్న పార్టీకి ఎక్కువ సమయం కేటాయించడం సరికాదన్నారు కేటీఆర్. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న అక్బరుద్ధీన్ వచ్చే ఎన్నికల్లో కనీసం 50 స్థానాల్లో పోటీ చేసిన 15 ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అడుగుపెడతాం అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana Assembly : దేశానికి కేసీఆర్ లాంటి డబుల్ ఇంపాక్ట్ సర్కార్ కావాలి : కేటీఆర్

కాగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ఎంఐఎంకు మధ్య మంచి సంబంధాలున్నాయి. కానీ ఇటీవల కాలంలో ఈ రెండు పార్టీలకు చెడిందనిపిస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారాక ప్రభుత్వ తీరు మారిందనేలా ఉంది. జాతీయ రాజకీయాల్లోనూ కీలకంగా ఉండాలనే ఉద్ధేశంతో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా రూపాంతరం చేశారు సీఎం కేసీఆర్.ఈ క్రమంలో ఎంఐఎంతో టీఆర్ఎస్ కాస్త దూరంగా ఉంటుందనేది స్పష్టమవుతోంది. కొత్త మిత్రులకు దగ్గరవుతున్న క్రమంలో పాత మిత్రులకు టీఆర్ఎస్ దూరమవుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.