Errabelli: దాడి జరగకున్నా జరిగినట్టు.. దెబ్బలు తాకకున్నా తాకినట్టు నటిస్తున్నారు: ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

దాడి జరగకున్నా జరిగినట్టు.. దెబ్బలు తాకకున్నా తాకినట్టు కొందరు నటిస్తున్నారంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచనల వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేసేవారు సీఎం కేసీఆర్ పై పరుష పదజాలం వాడితే వారిని ఉరికించి కొట్టాలని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఎర్రబెల్లి ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ... ఎవరి పార్టీ ప్రచారం వారు చేసుకుంటే ఫర్వాలేదని, ఆ సమయంలో తప్పుడుగా వ్యవహరిస్తే ప్రతిస్పందించాలని ఆయన తమ కార్యకర్తలకు సూచించారు.

Errabelli: దాడి జరగకున్నా జరిగినట్టు.. దెబ్బలు తాకకున్నా తాకినట్టు నటిస్తున్నారు: ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు

Errabelli

Errabelli: దాడి జరగకున్నా జరిగినట్టు.. దెబ్బలు తాకకున్నా తాకినట్టు కొందరు నటిస్తున్నారంటూ తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర చేసేవారు సీఎం కేసీఆర్ పై పరుష పదజాలం వాడితే వారిని ఉరికించి కొట్టాలని అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్న ఎర్రబెల్లి ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ… ఎవరి పార్టీ ప్రచారం వారు చేసుకుంటే ఫర్వాలేదని, ఆ సమయంలో తప్పుడుగా వ్యవహరిస్తే ప్రతిస్పందించాలని ఆయన తమ కార్యకర్తలకు సూచించారు.

దాడులు జరగకపోయినప్పటికీ కొందరు జరిగిందని చెబుతున్నారని ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. కాగా, తాజాగా వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల వరంగల్ లోని చెన్నారావుపేటలో పాదయాత్ర చేస్తున్న సమయంలో కలకలం చెలరేగిన విషయం తెలిసిందే. షర్మిల కేరవాన్‌కు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించి, బీభత్సం సృష్టించారు.

YS Sharmila: అందుకే సీఎం కేసీఆర్ తట్టుకోలేకపోతున్నారు: షర్మిల

దీంతో షర్మిల పాదయాత్ర ఆగిపోయింది. అనంతరం తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు గుప్పించారు. తాను పాదయాత్రలో ఎక్కడా వ్యక్తిగత విమర్శలు చేయలేదని అన్నారు. ఈ నేపథ్యంలో ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..