Telangana Lockdown : తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ, 144సెక్షన్.. మరోసారి క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని లేదా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచన ఏదీ లేదని ఇదివరకే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయినా జనాల్లో లాక్ డౌన్ అనుమానాలు తొలగలేదు. నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారేమోనని, 144 సెక్షన్ విధిస్తారేమోనని భయపడుతున్నారు. దీంతో ఈ అంశంపై రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.

Telangana Lockdown : తెలంగాణలో లాక్‌డౌన్, కర్ఫ్యూ, 144సెక్షన్.. మరోసారి క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం

Telangana Lockdown

Telangana Lockdown : రోజురోజుకి కరోనా కేసులు పెరిగిపోతుండటంతో తెలంగాణలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారని లేదా నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, లాక్ డౌన్ లేదా నైట్ కర్ఫ్యూ విధించే ఆలోచన ఏదీ లేదని ఇదివరకే ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. అయినా జనాల్లో లాక్ డౌన్ అనుమానాలు తొలగలేదు. నైట్ కర్ఫ్యూ అమలు చేస్తారేమోనని, 144 సెక్షన్ విధిస్తారేమోనని భయపడుతున్నారు. దీంతో ఈ అంశంపై రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు.

లాక్ డౌన్, కర్ఫ్యూ, 144 సెక్షన్ లేదు:
రాష్ట్రంలో లాక్‌డౌన్, కర్ఫ్యూ, 144 సెక్షన్ విధించే ఆస్కారం లేదన్నారు. ప్రజలే కరోనా నిబంధనలు పాటించాలన్నారు. అవసరం ఉంటే తప్ప ప్రజలు బయటికి రాకూడదని సూచించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఈటల రాజేందర్ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.

25ఏళ్లు పైబడిన వారికీ వ్యాక్సిన్:
కరోనా వ్యాక్సిన్ డోసులు ఎక్కువ ఇవ్వాలని కేంద్రాన్ని కోరినట్లు మంత్రి ఈటల చెప్పారు. అలాగే 25 సంవత్సరాల పైబడిన వారికి కూడా వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాటు చేయమని కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌ను కోరామన్నారు. అలాగే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కరోనా సెకండ్ వేవ్ గతంలో కంటే వేగంగా విస్తరిస్తోందని.. ప్రజలు భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటివి తప్పనిసరిగా చేయాలని మంత్రి సూచించారు.

తెలంగాణలో కోరలు చాస్తున్న కరోనా:
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. కొత్త కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. నిన్న(ఏప్రిల్ 15,2021) రాత్రి 8గంటల వరకు 1,21,880 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 3వేల 840 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత ఇవే అత్యధిక కేసులు.

రాష్ట్రంలో నిన్న కరోనాతో 9 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,797కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 1,198 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 3,09,594కి చేరింది. ప్రస్తుతం 30వేల 494 యాక్టివ్‌ కేసులు ఉన్నాచి. వారిలో 20,215 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 505 కేసులు నమోదయ్యాయి. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం(ఏప్రిల్ 16,2021) ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.