Minister Harish Rao : దేశం కంటే రాష్ట్ర గ్రోత్ రేట్ చాలా ఎక్కువ : మంత్రి హరీశ్‌రావు

రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశం కంటే రాష్ట్ర గ్రోత్ రేట్ చాలా ఎక్కువన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమీక్షించారు.

Minister Harish Rao : దేశం కంటే రాష్ట్ర గ్రోత్ రేట్ చాలా ఎక్కువ : మంత్రి హరీశ్‌రావు

Harish Rao (1)

Minister Harish Rao  review : రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేశం కంటే రాష్ట్ర గ్రోత్ రేట్ చాలా ఎక్కువని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడినప్పుడు దేశ జీడీపీలో తెలంగాణ వాటా 4శాతమన్నారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ వాటా 5శాతమని పేర్కొన్నారు. భారత దేశ ఆర్థిక పరిస్థితి బంగ్లాదేశ్‌ కంటే పడిపోయిందన్నారు. బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం భారత్‌ కంటే 10డాలర్లు ఎక్కువగా ఉందని వెల్లడించారు. బంగ్లాదేశ్‌లో తలసరి ఆదాయం 1885డాలర్లు, భారత్‌లో తలసరి ఆదాయం 1875డాలర్లు అని వివరించారు.

ఆరేళ్లలో తెలంగాణ వృద్ధి రేటు నంబర్ వన్‌ గా ఉందన్నారు. దేశంలో అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణది మూడో స్థానం అని చెప్పారు. తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలో తెలంగాణ నంబర్‌వన్ గా పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు ఇది నిదర్శనమన్నారు. తలసరి ఆదాయంలో ఏడేళ్ల క్రితం తెలంగాణ 10వ స్థానంలో ఉండేదని గుర్తు చేశారు. తలసరి ఆదాయంలో గత ఏడేళ్లలో ఏడు రాష్ట్రాలను తెలంగాణ అధిగమించిందన్నారు. 2014-15 తర్వాత తలసరి ఆదాయంలో దక్షిణాది రాష్ట్రాల్లోనే 11.5శాతంతో అత్యధిక సగటు వృద్ధిని తెలంగాణ నమోదు చేసిందన్నారు.

2014-15తో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం ఇప్పుడు 91.5శాతం పెరిగిందని చెప్పారు. 2014-15తో పోలిస్తే దేశ తలసరి ఆదాయం ఇప్పుడు 48.7శాతం మాత్రమే పెరిగిందన్నారు. దేశ సగటు తలసరి ఆదాయం కన్నా తెలంగాణ తలసరి ఆదాయమే ఎక్కువని వెల్లడించారు. కొంత కాలంగా సీఎం కేసీఆర్ అవలంభించిన విధానాల వల్లే తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందన్నారు. ఐటీ, ఇండస్ట్రీ, వ్యవసాయ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలతో రాష్ట్ర సంపద పెరిగిందని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రజల ఆదాయమూ పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రాల సొంత పన్ను ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ అని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర సొంత పన్ను ఆదాయం రూ.66,648కోట్లుగా ఉందని పేర్కొన్నారు. 2014-15తో పోలిస్తే రాష్ట్ర సొంత పన్ను ఆదాయంలో 90శాతం వృద్ధి సాధించామని స్పష్టం చేశారు. తెలంగాణ అప్పుల పాలవుతుందంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేసిన విమర్శలకు.. మంత్రి హరీశ్‌రావు క్లారిటీ ఇచ్చారు.