తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు : బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు.

తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు : బండి సంజయ్‌పై కేటీఆర్ ఫైర్

KTR angry over Bandi Sanjay : కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ఎంజాయ్ చేస్తోందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. గత ఆరేళ్లలో తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం 2లక్షల 72వేల 926 కోట్ల రూపాయలు పొందితే.. కేంద్రం నుంచి తెలంగాణకు కేవలం లక్ష 40వేల 329 కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు.

ఎవరు ఎవరికి ఇచ్చారో ఈ పెద్దమనిషి చెప్పాల్సిందిగా కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు. భారతదేశాభివృద్ధిలో తెలంగాణ తన వంతు పాత్ర పోషిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు.

తెలంగాణ రాకపోతే టీపీసీసీ, టీబీజేపీ ఎక్కడిదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు ఏనాడైనా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా అని నిలదీశారు. కేసీఆర్ ను విమర్శిస్తే ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ గురించి మాట్లాడితే మాటాలతోనే చీల్చి చండాడతామని హెచ్చరించారు.