ముఖ్యమంత్రులనే ఉరికించాం..మిమ్మల్ని ఉరికించడం లెక్క కాదు : మంత్రి కేటీఆర్

బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.

ముఖ్యమంత్రులనే ఉరికించాం..మిమ్మల్ని ఉరికించడం లెక్క కాదు : మంత్రి కేటీఆర్

minister-ktr

Minister KTR angry with the BJP leaders : బీజేపీ నేతలపై మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రులను ఉరికించిన చరిత్ర తమకుందని..మీలాంటి బఫూన్ గాళ్లను ఉరికించుడు మాకు లెక్క కాదన్నారు. ప్రతిది రాసిపెట్టుకుంటాం..టైమ్ వచ్చినప్పుడు మిత్తితో సహా వాపస్ ఇస్తామని చెప్పారు.

బాగా ఎగిరెగిరి మాట్లాడుతున్నారు..కేసీఆర్ ను ఎంత తిడితే అంత పైశాచికం ఆనందంతో ఒక పిచ్చి చానల్ చూపిస్తుంది..ఒక పిచ్చి పేపర్ రాస్తుంది.. జమ చేసుకున్న కిరాయి మూక కోసం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇలాగే మాట్లాడి ఒకాయన ఖతమై పోయారని ..ఇప్పుడు వీళ్లు ఎగురుతున్నారని పేర్కొన్నారు.

చరిత్రలో కేసీఆర్ తో పెట్టుకున్నోళ్లళ్లో ఒక్కరు కూడా బాగుపడలేదన్నారు. పెద్ద పెద్దోళ్లే ఖతమై పోయారని హెచ్చరించారు. మొరిగే కుక్కలు జాగ్రత్తగా ఉండాలని…మీ లెక్కలు మా దగ్గర ఉన్నాయని చెప్పారు. మీ సంగతి మా తమ్ముళ్లే చూసుకుంటారని.. మీకు కేసీఆర్ స్థాయి లేదని మేమే చూసుకుంటామని హెచ్చరించారు.

కేంద్రం గురించి తాము మాట్లాడుతున్న మాటల్లో ఒక్క తప్పు కూడా లేదన్నారు. మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఏమైందని ప్రశ్నించారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీ నుంచి కనీసం 20 మందికైనా డబ్బులిచ్చారా అని అడిగారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఐటీఐఆర్ ఎందుకు రద్దు చేశారు? అని ప్రశ్నించారు.