YS Sharmila : షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంఘీబావం
నల్గొండ జిల్లాలోని చండూరు మండలం పుల్లెంలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగుతోంది.
YS Sharmila : నల్గొండ జిల్లాలోని చండూరు మండలం పుల్లెంలలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష కొనసాగుతోంది. దీక్ష చేస్తున్న షర్మిలకు స్థానిక మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్ చేసి సంఘీబావం తెలిపారు. నిరుద్యోగ సమస్యలపై పోరాడుతున్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఉంటుందని తెలిపారు.
వైఎస్ షర్మిల నల్గొండ జిల్లాలో ఇవాళ ఉదయం దీక్ష చేపట్టారు. చండూరు మండలం పుల్లెంల గ్రామంలో షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష చేస్తున్నారు. గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాక ఆత్మహత్యకు పాల్పడిన పాక శ్రీకాంత్ (26) కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం ఆమె దీక్ష ప్రారంభించారు.
‘జోహార్ పాక శ్రీకాంత్’ అంటూ ఈ సందర్భంగా సభాస్థలి నుంచి షర్మిల నినాదాలు చేశారు. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటూ షర్మిల ప్రతీ మంగళవారం నిరుద్యోగుల కోసం చేస్తున్న నిరాహార దీక్ష నేటికి మూడో వారం చేరుకుంది.