MLC Elections Polling : రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. అధికార పార్టీని కలవరపెడుతున్న క్రాస్ ఓటింగ్ భయం

శుక్రవారం (డిసెంబర్ 10,2021) జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

MLC Elections Polling : రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్.. అధికార పార్టీని కలవరపెడుతున్న క్రాస్ ఓటింగ్ భయం

Mlc Elections Polling

MLC Elections Polling : శుక్రవారం (డిసెంబర్ 10,2021) జరగనున్న స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి సామగ్రిని అందజేశారు.

స్థానిక సంస్థల కోటా కింద 5 ఉమ్మడి జిల్లాల పరిధిలో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం 37 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనూ వెబ్‌ కాస్టింగ్‌ లేదా వీడియోగ్రఫీ ఉంటుందని అధికారులు తెలిపారు.

Amazon Prime: డిసెంబర్ 13వ తేదీలోపు అమెజాన్ సబ్‌స్క్రిప్షన్ తీసుకుంటే బెనిఫిట్ ఇదే!

ఇది ఇలా ఉంటే ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ ఓటర్లు గోవా క్యాంపు నుంచి హైదరాబాద్ బయలు దేరారు. రేపు ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా పోలింగ్ కేంద్రంకు వెళ్లనున్నారు. అధికార పార్టీని క్రాస్ ఓటింగ్ భయం కలవరం పెడుతోంది. టీఆర్ఎస్ కున్న మొత్తం ఓట్లలో 100 నుంచి 150 వరకు క్రాస్ అవుతాయని ప్రచారం జరుగుతోంది.

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. రాష్ట్రంలో మొతం 12 స్థానాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ కాగా.. నాలుగు జిల్లాల పరిధిలో ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగిలిన ఆరు స్థానాలకు మాత్రమే ఇప్పుడు పోలింగ్ అనివార్యమైంది.

ఎన్నికలు జరగనున్న జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, అధికారులతో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్‌ గోయల్‌ సమీక్ష నిర్వహించారు. పోలీసు భద్రతతో పాటు పోలింగ్ ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను, చేయాల్సిన ఏర్పాట్లను సమీక్షించారు. కొవిడ్ నిబంధనలు అమల్లో ఉండడంతో పాటు తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని పోలింగ్ కేంద్రాల్లో అదనంగా తీసుకోవాల్సిన అంశాలపై అధికారులకు సూచనలు చేశారు.

Facebook Profile Trick : మీ FB ప్రొఫైల్ ఎవరు చూశారో ఇట్టే తెలుసుకోవచ్చు!..

పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, కెమెరాలకు అనుమతి లేదని, ఎన్నికల సిబ్బంది మాత్రం వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ చేస్తుందని సీఈవో స్పష్టం చేశారు. ఇప్పటికే బ్యాలెట్ పేపర్లను ముద్రించామని, వాటికి అవసరమైన బ్యాలెట్ బాక్సులను సైతం సమకూర్చుకున్నామని తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి అవసరమైన శిక్షణను అందించామని, పోలింగ్ కేంద్రాల్లో తగిన వసతులను కూడా కల్పించామన్నారు. పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని బుధవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు ఈ ఐదు జిల్లాల పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులను మూసివేస్తున్నట్లు తెలిపారు.

గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల ప్రతినిధులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు. రాష్ట్రంలో మొతం 12 స్థానాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ జారీ కాగా.. నాలుగు జిల్లాల పరిధిలో ఆరుగురు అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో మిగిలిన ఆరు స్థానాలకు మాత్రమే ఇప్పుడు పోలింగ్ అనివార్యమైంది.