Moinabad Farmhouse: పోలీసుల అధీనంలో మొయినాబాద్ ఫాంహౌస్.. అందులో మళ్ళీ సోదాలు

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని పైలెట్‌ రోహిత్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారు ఇప్పటికీ పోలీసుల అధీనంలోనే ఉన్నారు. ఆ ముగ్గురిని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నారు. అలాగే, పోలీసుల అధీనంలో ఫాం​హౌస్ ఉంది.

Moinabad Farmhouse: పోలీసుల అధీనంలో మొయినాబాద్ ఫాంహౌస్.. అందులో మళ్ళీ సోదాలు

Moinabad Farmhouse case

Moinabad Farmhouse: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ లోని పైలెట్‌ రోహిత్‌రెడ్డికి చెందిన ఫాంహౌస్‌ వేదికగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు యత్నించిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారు ఇప్పటికీ పోలీసుల అధీనంలోనే ఉన్నారు. ఆ ముగ్గురిని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నారు.

అలాగే, పోలీసుల అధీనంలో ఫాం​హౌస్ ఉంది. అందులోకి ఇతరులను అనుమతించడం లేదు. అందులో పోలీసులు మరోసారి తనిఖీలు చేస్తున్నారు. అందులో డబ్బు ఉందా? అన్న కోణంలో సోదాలు జరుగుతున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న ప్రయత్నాల వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి పోలీసులు సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వారి నుంచి అన్ని వివరాలు రాబట్టాక వారిని కోర్టులో హాజరు పర్చుతారు. మరోవైపు, ఆ ముగ్గురు నిందితులు బీజేపీకి చెందిన వారు కాదని ఆ పార్టీ నేతలు అంటున్నారు.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..