Kodada : గంజాయికి బానిసైన కొడుకుని కట్టేసి, కళ్లలో కారం కొట్టిన తల్లి

ఏడాదిగా గంజాయికి బానిసైన కొడుకును బుద్ధి చెప్పడానికి ఓ సాధారణ తల్లి ఎంచుకున్న మార్గం ఇది. కొడుకును కరెంటు స్తంభానికి కట్టేసింది. కళ్లల్లో కారం పెట్టింది.

Kodada : గంజాయికి బానిసైన కొడుకుని కట్టేసి, కళ్లలో కారం కొట్టిన తల్లి

kodada

Kodada :  హైదరాబాద్‌ పుడింగ్ అండ్ మింక్‌ పబ్‌లో  దొరికిన వాళ్లల్లో ఎక్కువమంది బడాబడా కుటుంబాలకు చెందిన వాళ్లే. సొసైటీలో ఎంతో పేరున్న కుటుంబాలకు చెందినవాళ్లే. అర్థరాత్రి దాటినా పబ్బుల్లో అడ్డగోలుగా తాగుతూ.. రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ.. కొంతమంది ఏకంగా డ్రగ్స్‌ తీసుకుంటూ పోలీసులకు రెడ్‌హ్యాండెండ్‌గా పట్టుబడిపోయారు. ఇంతజరిగినా మా వాళ్ల తప్పేమీ లేదంటూ కొంతమంది స్టేట్‌మెంట్ల మీద స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు.. సరిగ్గా ఈ సమయంలోనే కోదాడలో జరిగిన ఓ సంఘటన.. బడాబాబులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని చాటి చెబుతోంది..

ఏడాదికి పైగా గంజాయికి బానిసైన కొడుకుకి బుద్ధి చెప్పడానికి ఓ సాధారణ తల్లి ఎంచుకున్న మార్గం ఇది. కొడుకును కరెంటు స్తంభానికి కట్టేసింది. కళ్లల్లో కారం పెట్టింది. ఇంకొసారి గంజాయి జోలికి వెళ్తావా అంటూ కొడుకును చితక్కొట్టింది. దారితప్పిన కొడుకును దారిలోకి తెచ్చుకోవడానికి ఆ తల్లి పడ్డ తాపత్రయం ఇది.

కొడుకు కళ్లల్లో ఇలా కారం పోయాల్సి వస్తుందని ఆమె ఎప్పుడూ అనుకుని కూడా ఉండదు. కానీ.. కొడుకు జీవితం బాగుపడాలంటే ఆ మాత్రం ట్రీట్‌మెంట్ ఇవ్వక తప్పలేదు. కోదాడలోని గాంధీనగరానికి  చెందిన రమణ దంపతులు కూలిపని చేసుకు బతుకుతున్నారు. వారి కుమారుడు సురేష్ (15) కి ఎలా అలవాటు అయ్యిందో గంజాయి తాగటం అలవాటు  అయ్యింది.
Also Read : Gold Smuggling : అండర్ వేర్ లో రూ.1 కోటి 70 లక్షల బంగారం స్మగ్లింగ్
ఏడాది కాలంగా గంజాయికి బానిసయ్యాడు. తల్లి తండ్రులు ఎంత చెప్పినా గంజాయి తాగటం మానట్లేదు. గంజాయి తాగి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోవటంతో భరించలేకపోయింది ఆ తల్లి.  ఈరోజు మరోసారి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా మాట వినలేదు ఆ కొడుకు.  దీంతో విసిగెత్తిన తల్లి….   కొడుకును కరెంట్ స్తంభానికి కట్టేసి కళ్లల్లో కారం కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమాజంలో ఓ సాధారణ తల్లే ఇలా బుద్ధి చెప్తే.. సొసైటీలో ఉన్నత స్థానంలో ఉన్న మిగతా వారు ఏం చేయాలి?