Revanth Reddy : కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తా – రేవంత్

కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. సోనియా విశ్వాసాన్ని, రాహుల్ గాంధీ నమ్మకాన్ని..తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

Revanth Reddy : కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తెస్తా – రేవంత్

Tpcc Chief Revanth

TPCC : కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన అనంతరం ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. సోనియా విశ్వాసాన్ని, రాహుల్ గాంధీ నమ్మకాన్ని..తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నేతలు, పెద్దల సహకారంతో పని చేస్తానని, కార్యకర్తల పార్టీ అని స్పష్టం చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారివైపు నిలబడే..పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ చేస్తున్న అరాచకాలపై పోరాటం ఉంటుందని, రాష్ట్రం సుభిక్షం కోసం పని చేస్తానని వెల్లడించారు. ఇతర కార్యక్రమాలను పెద్దల సలహాలు తీసుకుని..భవిష్యత్ కార్యాచరణనను వెల్లడిస్తామని తెలిపారు.

ఎంపిక విషయంలో అభిప్రాయం చెప్పిన వారందరినీ కలుపుకుని వెళుతానని తెలిపారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణను కేసీఆర్ చేతిలో బందీ అయ్యిందని, ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఏం చేయనుందో..అందరీ చేత చర్చిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలకు ఎప్పుడు తావు ఉంటుందని, ఇవన్నీ కాకుండా..ప్రజాస్వామ్యం అంటేనే కాంగ్రెస్ పార్టీ అని వెల్లడించారు. కుటుంబం అన్న తర్వాత..రకరకాల చర్చలు వస్తాయని, అందరూ కలిసి కొట్లాడే తత్వం పార్టీలో ఉందన్నారు.

ముఖ్యంగా కార్యకర్తల యొక్క ఆకాంక్షలకు అనుగుణంగా పని చేస్తానని, ఎవరికీ ఇబ్బంది ఉండదని మరోసారి చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ మా కుటుంబమేనని, అందరితో కలిసి మాట్లాడిన తర్వాతే..ప్రజలకు దగ్గరయ్యే కార్యాచరణ ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి.