My Home Constructions: మైహోమ్ కన్స్ట్రక్షన్స్ 35ఏళ్ల ప్రస్థానం
నిర్మాణ రంగంలోనే అగ్రగామిగా వెలుగొందుతోన్న మైహోమ్ కన్స్టక్షన్స్ సంస్థ 35 వసంతాలు పూర్తి ..
My Home Constructions: నిర్మాణ రంగంలోనే అగ్రగామిగా వెలుగొందుతోన్న మైహోమ్ కన్స్టక్షన్స్ సంస్థ 35 వసంతాలు పూర్తి చేసుకుంది. 1986లో ప్రారంభమైన ఈ మైహోమ్ కన్స్ట్రక్షన్స్ ప్రస్థానం అత్యుత్తమ నాణ్యతతో , కస్టమర్ల అభిమానంతో అనతి కాలంలోనే అగ్రగామిగా ఎదిగింది. భారీ ప్రాజెక్టులైనా, పొందికైన అపార్ట్మెంట్లు అయినా అద్భుతమైన నిర్మాణ సరళిని పాటించి తమకు సాటిలేరు అనిపించుకుంది.
ఇప్పటికే 20కి పైగా పెద్ద హౌజింగ్, కమర్షియల్ ప్రాజెక్టులు పూర్తిచేసి గ్రేట్ అనిపించుకుంది. 10వేలకు పైగా ఇళ్లను నిర్మించి కస్టమర్లకు అందజేసింది. అత్యున్నత నిర్మాణ విలువలు పాటిస్తూ కస్టమర్ల అభిమానాన్ని చూరగొంది. మైహోమ్ కన్స్టక్షన్స్ ప్రారంభించి 35 ఏళ్లైన సందర్భంగా కంపెనీ డైరెక్టర్లు.. సంస్థ విజయాన్ని మీడియాతో ఇలా పంచుకున్నారు.
వ్యాపారం అంటే.. సమాజానికి సేవ చేయడం అని మా చైర్మన్ భావిస్తారు. వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు భారీ ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. లాక్డౌన్ టైంలో అంతా ఆందోళన చెందినా..మేం స్థైర్యాన్ని కోల్పోలేదు. లాక్డౌన్ పరిస్థితులను ధైర్యంగా, ప్రతికూల పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్నాం. – జూపల్లి శ్యామ్రావు
ఈ సందర్భంగా తన మనసులో మాటను ఛైర్మన్ డాక్టర్ జూపల్లి రామేశ్వర్ రావు ఇలా పంచుకున్నారు. ‘కోకాపేటలోని మా వాణిజ్య ప్రాజెక్ట్ అత్యంత ప్రతిష్టాత్మకమైనది. ఆసియాలో అతిపెద్ద ఆఫీస్ ప్రాంగణాల్లో ఇది ఒకటి. 27 మిలియన్ చదరపు అడుగుల్లో కోకాపేట కమర్షియల్ ప్రాజెక్ట్ నెలకొల్పాం. శంషాబాద్ దగ్గర పర్యావరణ అనుకూల సుస్థిర నగరాన్ని నిర్మిస్తున్నాం. భావితరాలకు ప్రశాంతమైన జీవితాన్ని శంషాబాద్ ప్రాజెక్ట్ అందిస్తుంది. – డాక్టర్ జూపల్లి రామేశ్వర్రావు
కస్టమర్లకు సులువుగా సంప్రదించేందుకు.. ఆన్లైన్ లోనే బుకింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు వెబ్ సైట్ ను ప్రారంభించారు. ఉగాది నుంచి ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు.