Basara IIIT Students: వెనక్కి తగ్గిన విద్యార్థులు.. మంత్రి హామీతో ఆందోళన విరమణ
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెనక్కి తగ్గారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో ఆందోళన విరమణకు విద్యార్థులు అంగీకరించారు. గత వారం రోజులుగా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టిన విద్యార్థులు సీఎం కేసీఆర్ వచ్చి తమ సమస్యల పరిష్కారంకై హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. సోమవారం రాత్రి విద్యార్థుల వద్దకు స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెళ్లి చర్చలు జరిపారు. నెలరోజుల్లోనే డిమాండ్లన్నీ నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విమరణకు విద్యార్థులు అంగీకరించారు.

Basara IIIT Students: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వెనక్కి తగ్గారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీతో ఆందోళన విరమణకు విద్యార్థులు అంగీకరించారు. గత వారం రోజులుగా సమస్యల పరిష్కారం కోసం ఆందోళన బాటపట్టిన విద్యార్థులు సీఎం కేసీఆర్ వచ్చి తమ సమస్యల పరిష్కారంకై హామీ ఇవ్వాలని పట్టుబట్టారు. పలుదఫాలుగా అధికారులు, స్థానిక మంత్రి చర్చలు జరిపినప్పటికీ వెనక్కి తగ్గలేదు. పట్టువీడకుండా ఆందోళన కొనసాగిస్తున్న విద్యార్థుల వద్దకు స్వయంగా విద్యాశాఖ మంత్రి సబితా వెళ్లి చర్చలు జరిపారు. నెలరోజుల్లోనే డిమాండ్లన్నీ నెరవేరుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విమరణకు విద్యార్థులు అంగీకరించారు.
విద్యార్థులతో చర్చలు జరిపేందుకు సోమవారం రాత్రి 9.30గంటల ప్రాంతంలో మంత్రి సబితా ఇంధ్రారెడ్డితో పాటు విద్యాలయ ఉపకులపతి రాహుల్ బొజ్జా, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, విద్యాశాఖ కమిషనర్ వాకాటి కరుణలు క్యాంపస్ కు వెళ్లారు. తొలుత 20మంది ఎస్జీసీ( స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్) విద్యార్థులతో ఆడిటోరియంలో చర్చలు ప్రారంభించారు. అర్థరాత్రి 12.30 గంటల వరకు చర్చలు కొనసాగాయి. ఒక్కో సమస్యపై విద్యార్థులతో చర్చించి మంత్రి వాటి పరిష్కారం కోసం హామీ ఇచ్చారు. వీసీ నియామకంతో సహా అన్ని సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని, నెల రోజుల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి విద్యార్థులకు హామీ ఇచ్చారు. అయితే రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు కోరగా.. సంబంధిత శాఖ మంత్రిని స్వయంగా చెప్తున్నా.. ఇంకా ఎలాంటి హామీ కావాలని సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
Secunderabad Violence Remand Report : సికింద్రాబాద్ అల్లర్ల కేసు.. రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
మంత్రి హామీతో ఆందోళన విరమించాలా, కొనసాగించాలా అన్నదానిపై చర్చించుకున్న విద్యార్థులు.. అనంతరం క్యాంపస్ ప్రధాన గేటు వద్దకు వచ్చి మీడియాతో మాట్లాడారు. డిమాండ్లను పరిష్కరిస్తారని మంత్రిపై, అధికారులపై నమ్మకం ఉందని.. ఆందోళన విరమిస్తున్నామని ప్రకటించారు. దీంతో నేటి నుంచి విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు.
- Telangana Politics : కమలం గూటికి కొండా..బీజేపీలో చేరటానికి రంగం సిద్ధం చేసుకున్న మాజీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి..
- Telangana: 30న పదో తరగతి పరీక్ష ఫలితాలు
- Golconda Bonalu: గోల్కొండ బోనాల వేళ పటిష్ఠ భద్రత: సీఐ చంద్ర శేఖర్ రెడ్డి
- T Hub 2 In Hyderabad : T-Hub 2ను ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- Bonalu : రెండేళ్ల తరువాత జరిగే బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
1Auto Catches Fire: ఆటోపై విద్యుత్ తీగలు పడి.. ఐదుగురు సజీవ దహనం
2Raashii Khanna : నాకు కామెడీ కంటే హీరోలతో రొమాన్స్ చేయడం చాలా ఈజీ..
3Suriya : ఆస్కార్ కమిటీలోకి ఆహ్వానం.. మొదటి సౌత్ ఇండియన్ యాక్టర్ గా సూర్య..
4GST: కొత్త జీఎస్టీ పరిధిలోకి మజ్జిగ, పెరుగు, లస్సీ.. వచ్చే నెల నుంచే అమలు
5Archana : మగధీర సినిమాలో ఛాన్స్ వదులుకున్నా.. అది చేసి ఉంటే..
6Anand Mahindra: హైదరాబాద్లో రేసింగ్.. అధికారికంగానే
7Sambhaji Nagar: ఔరంగబాద్ కాదు.. శంభాజీ నగర్!
8Karnataka Police : కారణం చెప్పకుండా.. సంకెళ్లు వేయడం చట్ట వ్యతిరేకం
9Maharashtra CM: ‘మహా’ సీఎంగా ఫడ్నవీస్.. రేపే ప్రమాణ స్వీకారం?
10Salma Khan : దేవిశ్రీని పక్కన పెట్టేసిన సల్లూ భాయ్.. KGF మ్యూజిక్ డైరెక్టర్ కి ఛాన్స్..
-
Uddhav Thackeray Resign : బలపరీక్షకు ముందే.. సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా
-
Nothing phone (1) : నథింగ్ ఫోన్ (1) ఫోన్ కొత్త ఫీచర్ అదిరిందిగా.. ఇండియాలో ధర ఎంత ఉండొచ్చుంటే?
-
TET Final Key : తెలంగాణ TET ఫైనల్ ‘కీ’ రిలీజ్
-
Twitter Accounts : ట్విటర్కు గట్టి షాకిచ్చిన కేంద్రం.. జూలై 4 వరకే డెడ్లైన్!
-
Hyderabad : ఆసియా-పసిఫిక్ స్థిరమైన నగరాల్లో టాప్ 20లో హైదరాబాద్
-
Ram Pothineni: తమిళ డైరెక్టర్స్కే రామ్ ప్రిఫరెన్స్..?
-
Rajamouli: మహేష్, జక్కన్న లెక్క మూడు!
-
Madhya Pradesh : మద్యం మత్తులో మహిళకు నిప్పంటించిన నలుగురు వ్యక్తులు