భార్యను చంపేశాడు, ప్రియురాలు సూసైడ్..కొత్తలంక మర్డర్ లో కొత్త ట్విస్ట్

భార్యను చంపేశాడు, ప్రియురాలు సూసైడ్..కొత్తలంక మర్డర్ లో కొత్త ట్విస్ట్

Murder

Kottalanka Wife Murder : ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపాడు ఓ భర్త.. చివరికి ఆ యువకుడి ఉన్మాదం తెలుసుకున్న ప్రియురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లిలో జరిగింది.. ప్రియురాలి వ్యామోహంలో పెళ్లయిన రెండు నెలలకే భార్య నవ్యరెడ్డిని చంపాడు భర్త నాగశేషు.. అయ్యవారిగూడానికి చెందిన నవ్యరెడ్డి బీటెక్ సెకండియర్ స్టూడెంట్‌.. ఆమెకు తన మేనమామ కుమారుడు నాగశేషుతో ఇటీవలే వివాహం జరిగింది.

ఫిబ్రవరి 3న నాగశేషు తన భార్య నవ్యను బైక్ పై ఎక్కించుకుని కాలేజీలో డ్రాప్ చేస్తానని బయల్దేరాడు. మార్గమధ్యంలో మత్తుమందు కలిపిన నీళ్లు భార్యతో తాగించాడు. ఆమె స్పృహ కోల్పోయాక సమీపంలోని గుట్టల్లోకి తీసుకెళ్లి మెడకు చున్నీ బిగించి హతమార్చాడు. నవ్య సెల్ ఫోన్ నుంచి బ్యాక్‌లాగ్‌ సబ్జెక్టుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆమె తండ్రికి మెసేజ్‌ పంపాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. సీసీ కెమెరా ఫుటేజి పరిశీలించగా, భర్త నాగశేషు దుర్మార్గం బట్టబయలైంది. అతనే నవ్యను బయటికి తీసుకెళ్లినట్టు తేటతెల్లమైంది. ప్రియురాలి కోసమే ఈ హత్య చేసినట్టు తెలిసింది. సినిమా రేంజ్‌లో స్క్రీన్‌ప్లే నడిపించిన నాగశేషు… చివరికి కటకటాల్లోకి వెళ్లాడు.