Tenth Class Exams : టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.. ఈసారి కూడా ఆరే

పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఊరటనిచ్చే కబురు అందించింది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది.

Tenth Class Exams : టెన్త్ విద్యార్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్.. పరీక్షలపై కీలక నిర్ణయం.. ఈసారి కూడా ఆరే

Tenth Class Exams : పదో తరగతి పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఊరటనిచ్చే కబురు అందించింది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లతోనే ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ చేసిన ప్రతిపాదనలకు సర్కార్ ఆమోదం తెలిపింది. 2022లో 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లకు కుదించి ప్రభుత్వం టెన్త్ పరీక్షలు నిర్వహించగా, 2023లోనూ 6 పేపర్లతోనే పరీక్షలు నిర్వహించనున్నారు.

కరోనా మహమ్మారి నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా విద్యార్థులపై భారం పడకుండా 2021-2022 విద్యా సంవత్సరంలో టెన్త్ పరీక్ష పేపర్లను 11 నుంచి 6కు కుదించారు. విద్యాశాఖ తీసుకున్న ఈ నిర్ణయం అప్పట్లో విద్యార్థులపై పరీక్షల ఒత్తిడిని చాలావరకు తగ్గించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కరోనాకు ముందు రాష్ట్రంలో టెన్త్ ఎగ్జామ్స్ కు సంబంధించి మొత్తం 11 పేపర్లు ఉండేవి. తెలుగు, ఇంగ్లీష్‌, గ‌ణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం స‌బ్జెక్టుల‌ను రెండు పేప‌ర్లుగా పరీక్ష నిర్వహించే వారు. హిందీ స‌బ్జెక్ట్‌కు ఒకే ప‌రీక్ష ఉండేది. ఇప్పుడు ఆరు సబ్జెక్టులకు చెరో పేపర్ మాత్రమే ఉంటుంది.

2021లో 11 పేపర్లను 6 పేపర్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. క్లాసులు సరిగ్గా జరగకపోవడం, సిలబస్ పూర్తికాకపోడం, విద్యార్థుల్లో ఒత్తిడి కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే 2021లో కరోనా ఉధృతి కారణంగా అసలు పరీక్షలే నిర్వహించలేదు. అనంతరం 2022లో 6 పేపర్లతోనే ఎగ్జామ్స్ నిర్వహించారు. ఈ విద్యా సంవత్సరానికి గాను 2023లో నిర్వహించనున్న పరీక్షలకు కూడా 6 పేపర్లతోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులు ఇబ్బంది పడకుండా.. వారిలో ఒత్తిడి తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో విద్యార్థులకు భారీ ఊరట కలిగింది.