ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం…గుప్త నిధుల కోసం బాలికను బలి ఇచ్చారా?

ఖమ్మం జిల్లాలో క్షుద్ర పూజల కలకలం…గుప్త నిధుల కోసం బాలికను బలి ఇచ్చారా?

Occult worship in Khammam : ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలంలో క్షుద్ర పూజల కలకలం నెలకొంది. రేమిడిచర్లలో ఓ కుటుంబం గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపింది. గద్దె నరసింహారావు ఇంటిలో 30 అడుగుల లోతు గుంత తవ్వారు. ఇది 20 రోజులుగా కొనసాగుతోంది. గద్దె నరసింహారావు రెండ్రోజుల క్రితం బాలిక తల్లిని వేరే ఊరు పంపించారు. అప్పట్నుంచి బాలిక కనిపించకుండా పోయింది.

మరోవైపు గ్రామంలో ఓ బాలిక కనిపించకుండాపోవడం ఆందోళన కలిగిస్తోంది. అనారోగ్యంతో ఉన్న బాలికను తీసుకొచ్చి పూజలో కూర్చోబెట్టారనే వార్తలు వినిపిస్తున్నాయి. బాలిక అనారోగ్యం తగ్గిస్తామని చెప్పి తీసుకువచ్చినట్లు సమాచారం. అయితే బాలికను బలి ఇచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నరసింహారావు కుటుంబ సభ్యులు పోలీసులను కూడా ఇంట్లోకి రాకుండా అడ్డుకున్నారు. క్షుద్రపూజల ఆనవాళ్లను చెరిపేసేందుకు ప్రయత్నం చేశారు.

బెంగళూరుకు చెందిన వ్యక్తి స్థానికంగా ఉన్న నర్సింహారావుతో పూజలు చేయిస్తూ
అదే గ్రామానికి చెందిన రాజేశ్వరి అనే బాలికను పూజలో కూర్చోబెట్టారని, అనారోగ్యం పాలైన ఆమెను తల్లి రాణితో మాట్లాడి పెదకాకానికి వెళ్లి వైద్యం చేయించుకోవాలని సూచించారు. పెదకాకానికి వెళ్లేందుకు తల్లి బయటికెళ్లడంతో నిన్న రాజేశ్వరి కనిపించకుండా పోయింది.

గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం నర్సింహారావు..క్షుద్రపూజల కోసం రాజేశ్వరిని బలి ఇచ్చే ప్రయత్నం చేశాడని విషయం తెలిసి బాలిక పారిపోయిందని చెబుతున్నారు. క్షుద్ర పూజల కోసం అమ్మాయిని చంపేసి ఉంటారని కుటుంబ సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. స్థానికులు, తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ ఐ ఘటనాస్థలికి వెళ్లినప్పటికీ ఇంట్లోకి రానివ్వకుండా నర్సింహారావు ప్రయత్నం చేశారు.

అయితే అతన్ని లెక్కచేయకుండా పోలీసులు ఇంటి లోపలికి వెళ్లారు. 30 అడుగుల లోతు గుంతను, క్షుద్రపూజలు చేసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపించినట్లు గుర్తించారు. అక్కడ బలి ఇచ్చిన ఆనవాళ్లు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. పూజలు చేస్తున్న క్రమంలో రాజేశ్వరి పారిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. కేను నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.