Tea : ప్రాణం తీసిన టీ.. ఒకరు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం.. అసలేం జరిగిందంటే..

old woman dies after having tea : టీ.. ఓ కుటుంబంలో తీరని విషాదం నింపింది. ఒకరి చావుకి కారణమైంది. మరో ఇద్దరు చావుతో పోరాడుతున్నారు. అసలేం జరిగిందంటే.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన దంపతులు అంజమ్మ(60), దాసారం మల్లయ్య(70), అంజమ్మ మరిది భిక్షపతి(60) రోజు మాదిరిగానే బుధవారం(మార్చి 31,2021) ఉదయం కూడా టీ తాగారు.

అయితే అంజమ్మ టీ చేసే సమయంలో టీ పొడి అనుకొని పొరపాటున పాలలో విష గుళికలు(ఎండ్రిన్) వేసింది. అంతే.. టీ తాగిన 10 నిమిషాలకు ముగ్గురూ అస్వస్థతకు గురయ్యారు. వీరిని జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అంజమ్మ చనిపోయింది. మిగతా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.

ట్రెండింగ్ వార్తలు