మద్యం మత్తులో కారు నడిపి ఒకరి ప్రాణం తీశాడు

మద్యం మత్తులో కారు నడిపి ఒకరి ప్రాణం తీశాడు

one killed in road accident : మద్యం తాగి వాహనాలు నడపొద్దని పోలీసులు చెబుతున్నా మందుబాబులు మాత్రం వినడం లేదు. తాగి వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు. హైదరాబాద్‌ వనస్థలిపురంలో మద్యం మత్తులో కారు నడిపిన ఓ యువకుడు… ఒకరి ప్రాణం తీశాడు. హస్తనాపురంలో తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. గౌతమ్ అనే యువకుడు మద్యం సేవించి కారు నడపి ట్రాఫిక్ సిగ్నల్ స్తంభాన్ని ఢీకొట్టాడు.

సాగర్ రోడ్‌ నుంచి ఇబ్రహీంపట్నం వైపు వెళ్తూ.. ట్రాఫిక్‌ పోల్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కారులో వెనుక సీట్లో కూర్చొన్న సందీప్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కారులోనే ఉన్న మరో యువకుడు… ప్రమాదం జరిగిన వెంటనే పరారయ్యాడు.. మద్యం తాగి కారు నడిపిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.